English | Telugu

మాస్ జాతరకు షాకింగ్ కలెక్షన్స్..!

ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ.. రీసెంట్ గా 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించారు. అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్ షోలతో ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టింది. విడుదలకు ముందు పెద్దగా బజ్ లేదు. థియేట్రికల్ బిజినెస్ కూడా సేఫ్ జోన్ లో జరిగింది. అయితే రవితేజకు అచ్చొచ్చిన యాక్షన్ కామెడీ జానర్ లో 'మాస్ జాతర' రూపొందడంతో.. ఈ సినిమాతో ఆయన కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ మూవీకి వస్తున్న కలెక్షన్స్ షాకింగ్ గా ఉన్నాయి. (Mass Jathara)

మాస్ జాతర మూవీ రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. రవితేజ లాంటి స్టార్ నటించిన సినిమా రూ.20 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. దీంతో 'మాస్ జాతర' మూవీ బజ్ తో సంబంధం లేకుండా.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, మొదటి షో నుండే డివైడ్ టాక్ రావడంతో.. ఇప్పుడు ఆ చిన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కొండంతలా కనిపిస్తోంది.

Also Read: జర్నీ సినిమాని గుర్తు చేస్తున్న వరుస బస్సు ప్రమాదాలు!

ట్రేడ్ లెక్కల ప్రకారం.. మొదటి రెండు రోజుల్లో 'మాస్ జాతర' చిత్రం రూ.7 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అంటే హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. మరో రూ.13 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మూడు కోట్లకు మించి కలెక్ట్ చేసే ఛాన్స్ లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పలుసార్లు వాయిదా పడటం, ప్రమోషనల్ కంటెంట్ రెగ్యులర్ గా ఉండటంతో 'మాస్ జాతర'పై విడుదలకు పెద్దగా బజ్ రాలేదు. పైగా అక్టోబర్ 31 విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 'బాహుబలి: ది ఎపిక్' కారణంగా ఒక రోజు పోస్ట్ పోన్ చేశారు. దీంతో మూడు రోజుల ఫస్ట్ వీకెండ్ కాస్తా, రెండు రోజులకు పరిమితమైంది. దానికి తోడు పాజిటివ్ టాక్ రాకపోవడంతో.. ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల అంశాలతో మాస్ జాతర మూవీ ఫుల్ రన్ లో రూ.10 కోట్ల షేర్ కి పరిమితమయ్యే అవకాశముంది అంటున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.