English | Telugu

ప్రశాంత్ వర్మ బ్యాడ్ టైం.. ఆగిపోయిన ప్రభాస్ ప్రాజెక్ట్..!

దర్శకుడు ప్రశాంత్ వర్మకు వరుస షాక్ లు
ఓ వైపు నిర్మాతల ఫిర్యాదులు
మరోవైపు ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత స్పిరిట్, సలార్-2, కల్కి 2, బ్రహ్మ రాక్షస వంటి పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో 'బ్రహ్మ రాక్షస' ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

హనుమాన్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇంతవరకు తన దర్శకత్వంలో మరో సినిమాని పట్టలెక్కించలేదు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో తలపెట్టిన బ్రహ్మ రాక్షస ఆగిపోయింది. నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటనకే పరిమితమైంది. హనుమాన్ కి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాకముందే ఎండ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Prasanth Varma)

ప్రభాస్ తో ఓ సినిమా చేసే అవకాశాన్ని ప్రశాంత్ వర్మ దక్కించుకున్నారు. ఇది రణవీర్ సింగ్ తో చేయాలనుకున్న బ్రహ్మ రాక్షస అనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడినట్లు న్యూస్ వినిపిస్తోంది.

Also Read: జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టైం అంతగా బాలేదు. ప్రశాంత్ వర్మ వల్ల తమకు నష్టం జరిగింది అంటూ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. హనుమాన్ తర్వాత అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తానని రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని ఆరోపించారు. అలాగే, మరో పది కోట్లతో ఆక్టోపస్ అనే సినిమా రైట్స్ కొనిపించారని పేర్కొన్నారు. అడ్వాన్స్ తీసుకొని సినిమాలు చేయట్లేదని, తమకి జరిగిన నష్టానికి పరిహారంగా రూ.200 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

అయితే హనుమాన్ నిర్మాత ఆరోపణలను ప్రశాంత్ వర్మ ఖండించారు. తాను అడ్వాన్స్ లు తీసుకొని సినిమాలు చేయట్లేదన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు. నిజానికి హనుమాన్ లాభాల్లో తనకి వాటా ఇవ్వాల్సి ఉందని.. అది ఇవ్వకపోగా, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

మరోవైపు ప్రశాంత్ వర్మ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా డబ్బు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడం ప్రశాంత్ వర్మ బిగ్ షాక్ అని చెప్పవచ్చు. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.