English | Telugu

నా అంతరాత్మ ఒక స్వర్ణయుగం.. భాగ్యశ్రీ బోర్సే మొత్తం చెప్పేసింది 

-భాగ్యశ్రీ బోర్సే ఏం చెప్పింది!
-కాంత గురించి ఏమంటుంది
-ఖుష్బూ చెప్పిన విషయాలు ఏంటి!

అందంతో పాటు అందానికి తగ్గ అభినయం కలగలిపిన నటీమణులు పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ఎంతో రేర్ గా తళుక్కుమంటారు. అభిమానులు ప్రేక్షకులు కూడా సదరు నటీమణులని దేవకన్యల్లాగా భావిస్తారు. అలాంటి ఒక దేవకన్యే 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse). అందుకే మొదటి చిత్రం మిస్టర్ బచ్చన్ పరాజయం పాలైనా వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల 14 న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)తో కలిసి చేసిన 'కాంత' తో తమిళ, తెలుగు, మలయాళ ప్రేక్షకులని పలకరించనుంది.

ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతు 'కాంత'(Kaantha)తోనే నేను దక్షిణాదికి పరిచయం కావాల్సింది. నేను విన్న మొట్టమొదటి సబ్జెక్టు కూడా ఇదే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. 1950 ,60 వ కాలం నేపథ్యంలో జరిగే కథలో నా క్యారక్టర్ పేరు కుమారి. సదరు క్యారక్టర్ చెయ్యడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలనాటి హీరోయిన్స్ లాగా కళ్ళతోనే భావాలు పలికించాలి. ఇందుకోసం సావిత్రి, శ్రీదేవి గారి సినిమాలు చూడటంతో పాటు కొంత మంది మనుషులని కూడా కలిసాను. ఇప్పుడు పలికే సంబాషణలకి, నాటి తరం సంబాషణలకి చాలా తేడా ఉంది. అందుకే సంభాషణలు స్పష్టంగా చెప్పడానికే ఆరు నెలల సమయం తీసుకున్నాను.

ఈ మధ్య సీనియర్ నటీమణి ఖుష్బూ గారిని కలిసాను. ఆమె నాతో మాట్లాడుతు సోషల్ మీడియా లేని రోజుల్లో జీవితం ఎంత వైవిధ్యంగా ఉండేదో, ప్రస్తుతం సోషల్ మీడియా మోజులో పడి మనం ఎలాంటి ఆనందమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నామో చెప్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఆ కాలాన్నిస్వర్ణ యుగం అని ఎందుకు కూడా అంటారో కూడా 'కాంత' ద్వారా అర్ధమయింది. నా అంతరాత్మ మాత్రం అప్పటి కాలానికి దగ్గరగానే ఉంటుందని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. మహారాష్ట్ర లోని పూణే భాగ్యశ్రీ స్వస్థలం కాగా 'రామ్ పోతినేని'(Ram Pothineni)తో చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో ఈ నెల 28 న మరో మారు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.