English | Telugu

ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు విన్నర్ 

- బాహుబలి ఎపిక్ vs మాస్ జాతర
- ప్రభాస్, రాజమౌళి, రానా షో స్టార్ట్
- మాస్ జాతర పై భారీ అంచనాలు
- రవి తేజ ఫాన్స్ హంగామ

శుక్రవారం అంటేనే సినిమా.. సినిమా అంటేనే శుక్రవారం. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రోజు రిలీజ్ అయ్యే చిత్రాల మధ్య జరిగే పోటీ ఎంతో రసవత్తరంగా ఉంటుంది. ఒక వేళ అగ్ర హీరోలకి సంబంధించిన రెండు ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ విడుదలైతే, తొలి రోజు కలెక్షన్స్ విషయంలో అభిమానుల మధ్య పోటీ కూడా నెలకొని ఉంటుంది. మూవీ లవర్స్ సైతం ఈ విషయంలో ఎంతో ఆసక్తిని కనపరచడం ఆనవాయితీ.

తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 చిత్రాలు బాహుబలి ఎపిక్(Baahubali Epic)గా ఈ నెల 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎపిక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి(Ss Rajamoul),ప్రభాస్(Prabhas),రానా(Rana)లు ప్రమోషన్స్ లో ఎపిక్ గురించి పలు ఆసక్తి కర విషయాలని చెప్తున్నారు. దీంతో ఎపిక్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అనే ఉత్సాహం అందరిలో ఉంది. ఇక నవంబర్ 1 న విడుదల అవుతున్న మాస్ మహారాజా రవితేజ(Raviteja)వన్ మాన్ షో మాస్ జాతర(Mass Jathara)కోసం కూడా అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పక్కా మాస్ అంశాలతో మాస్ జాతర ముస్తాబవడం, భీమ్స్ అందించిన సాంగ్స్ ప్రేక్షకుల్లోకి వెళ్లడం, థమాకా తో మెప్పించిన రవితేజ శ్రీలీల కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చెయ్యబోతుందని ట్రైలర్ తో అర్ధం కావడంతో మాస్ జాతర కోసం కూడా అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Also Read: చిరంజీవి పై మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు.. రూమర్స్ కి చెక్


దీంతో ఈ రెండు చిత్రాలు ఒక రోజు తేడాతోనే వస్తున్నా, తొలి రోజు హయ్యస్ట్ కలెక్షన్స్ లో ఎవరు గెలుస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో జరుగుతుంది. ప్రస్తుతం రెండు చిత్రాలకి బుక్ మై షో లాంటి యాప్స్ లో బుకింగ్స్ ఫాస్ట్ గానే ఉన్నాయి. రెండు చిత్రాలు ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఓవర్ సీస్ లో కూడా రెండు చిత్రాలు ప్రీమియర్స్ దగ్గర నుంచే సందడి చేయనున్నాయి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.