English | Telugu

నాన్నా రాజమౌళి.. ప్రభాస్ ని ఇలా ఎప్పుడూ చూసుండరు!

- బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ
- ప్రోమోలో నవ్వులు పూయించిన బాహుబలి త్రయం

అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతాన్ని 'బాహుబలి' రూపంలో టాలీవుడ్ చూసింది. అయితే ఆ అద్భుతం వెనుక.. మనకి తెలియని మరెన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం 'బాహుబలి' అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు రెండు భాగాలూ కలిపి ఒకటే సినిమాగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెడుతోంది. (Baahubali: The Epic)

'బాహుబలి' రీ రిలీజ్ సందర్భంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళితో కలిసి ప్రభాస్, రానా సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

"బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాలి అనే దానికంటే.. ఆ నిర్ణయానికి కట్టప్ప ఎప్పుడు వస్తాడు?" అనే పాయింట్ దగ్గరే తాను ఆగిపోయినట్లు రాజమౌళి చెప్పుకొచ్చాడు. "నాన్నా రాజమౌళి.. ప్లీజ్ అది వేయండి" అంటూ ఒక విషయంలో రాజమౌళిని ప్రభాస్ రిక్వెస్ట్ చేయడం సరదాగా ఉంది. "కిరీటం మీద చేయి పెట్టి మాట్లాడిన రోజే.. అది నా కింగ్డమ్ అని ఫిక్స్ అయిపోయాను" అంటూ భల్లాలదేవ పాత్రను తాను ఎంతలా ఓన్ చేసుకున్నది రానా తెలిపాడు.

మొత్తానికి కొన్ని జ్ఞాపకాలు, కొన్ని నవ్వులతో ఈ ఇంటర్వ్యూ ప్రోమో భలే ఉంది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల కానుంది.

Also Read: స్టార్ కిడ్ చేతికి విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్..!

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.