English | Telugu

సీఎం జగన్‌కు కరోనా టెస్ట్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. కరోనా పరీక్షలో జగన్‌కు నెగెటివ్‌గా నిర్ధారించారు. మొదటిసారిగా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా వైద్యులు సీఎంకు పరీక్షలు చేశారు.

ర్యాపిడ్‌ టెస్ట్ కిట్లును దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం తెప్పించింది. సియోల్‌ నుంచి ప్రత్యేక విమానం ద్వారా శుక్రవారం రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు వచ్చాయి. టెస్ట్ కిట్లను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాలలోనే కరోనా ఫలితం తేలనుంది.