కొత్త చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జారీ చేసిన జీఓ ను సవాల్ చేస్తూ ఈ రోజు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. నూతన ఎస్ ఈ సీ నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ కు చట్టబద్ధత లేదు అంటూ యోగేష్ అని వ్యక్తి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారంనాడు ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం విచారిస్తుంది.