English | Telugu

సీఆర్డీఏ వర్సెస్ మందడం రైతులు

తుళ్ళూరు మండలం మందడం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఆర్డీఏ సిబ్బంది తో రైతుల వాగ్వివాదం కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ళు లేని నిరుపేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సి ఆర్ డి ఏ అధికారులు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గతంలోనే పట్టాలు ఇవ్వటం కుదరదు అంటూ కోర్టును ఆశ్రయించిన రైతులు.

అభ్యంతరాలు తెలిపేందుకు కోర్టుకు రావాలంటూ రైతులకు నోటీసులు ఇచ్చేందుకు మందడం పంచాయితీ కార్యాలయంలో కి వచ్చిన సీఆర్డీఏ సిబ్బంది. లాక్ డౌన్ ఉన్నపుడు రైతులు కోర్టుకు ఎలా వస్తారంటూ సీఆర్డీఏ సిబ్బందిని ప్రశ్నించిన రైతులు.

సామాన్య ప్రజలు కూరకాయలు తెచుకోవటానికే బయటకు రానివ్వని పోలీసులు మీకు బయటకు రావటానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన రైతులు. దీంతో సీఆర్డీఏ సిబ్బంది అనివార్యంగా వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.