English | Telugu

దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు! కిషన్‌రెడ్డి

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని వెల్లడించారు.

‘‘ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు. తాజా కూరగాయలు అవసరంలేదు. పప్పుతో తినండి. వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోండని కిష‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు. ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఎక్కడివారు అక్కడే ఉంటారు. విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుంది. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయికూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.