బాబు–పవన్ బంధమే వైసీపీకి బ్రేకా..సర్వేలో సంచలన సంకేతాలు..!

Publish Date:Jul 3, 2026

Advertisement

 

సొంత సర్వేతోనే జగన్‌కు షాక్?.. ‘మావిగన్’ వ్యూహంపై పార్టీలో అసంతృప్తి..?

నెల్లూరు కాంట్రాక్టర్ కార్యాలయంలో వైసీపీ సర్వే బృందం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు "మావిగన్" నినాదం ఉపయోగపడుతుందంటూ తెలంగాణకు చెందిన ఓ మేధావి సూచించారనే ప్రచారం కూడా సాగుతోంది. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహం ఫలితం ఏమిటో అర్థంకాక పలువురు నేతలు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. "మావిగన్" అనే నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతినే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో మరోసారి రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.

పార్టీ తరఫున సర్వేలు నిర్వహించే బాధ్యతను ఇద్దరు మాజీ అధికారులకు అప్పగించినట్లు సమాచారం. వీరు తరచూ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి–మైండ్‌స్పేస్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆ కార్యాలయంలోనే సర్వే బృందానికి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది.

గతంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ సర్వేల వ్యవహారాన్ని పర్యవేక్షించేవారని, అయితే ఆ సర్వేలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ బాధ్యతను నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్–రాజకీయ నాయకుడికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వే ఫలితాలు పార్టీ అధినేతను తీవ్ర నిరాశకు గురిచేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ సమన్వయం బలంగా కొనసాగుతున్నంతకాలం వైసీపీకి అధికార అవకాశాలు పరిమితంగానే ఉంటాయని సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే కొత్త రాజకీయ నినాదాలు, వ్యూహాలపై పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

జమీన్ రైతు పత్రిక ప్రత్యేక కథనం..!

By
en-us Political News

  
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.
తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం, హత్య ఉదంతం కేసులో దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి.
అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు అండగా నిలిచే ఇస్లామిక్ మిత్రదేశమే ఈ విధంగా పాక్ బయాయిలను ముక్కుపిండి మరీ వసూలు చేయడానికి సిద్ధం కావడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. అప్పులు తీసుకోవడం, వాటిని సకాలంలో తీర్చకుండా కాలయాపన చేయడం పాకిస్థాన్ కు మామూలే. అయితే ఈ సారి మాతరం యూఏఈ కాలయాపనను ఇసుమంతైనా సహించేది లేదని అల్టిమేటం ఇవ్వడంతో పాకిస్థాన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.