జగన్ చంద్రబాబుకు క్షమాపణలు చెబుతాడా..?

Publish Date:Jun 4, 2016

Advertisement

 

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒకదాని తరువాత ఒకటి కష్టాలు ఎదురవుతున్నట్టు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ.. దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే.. ఇప్పుడు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్రకు కూడా అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఎప్పుడూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడే జగన్ ఎప్పటి లాగే రెండు రోజుల క్రితం జరిగిన ఒక సభలో ఆయనపై తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని చెప్పులతో కొట్టాలనే పదజాలం వాడుతూ ఆయనను విమర్శించారు. ఇక అంతే ఈ మాటలు విన్న తెలుగు తమ్ముళ్లు ఊరుకుంటారా ఇప్పుడు వైఎస్ జగన్ పై తిట్ల పురాణం మొదలుపెట్టారు.

 

ఈ నేపథ్యంలోనే ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్రను అడ్డుకుంటున్నారు. నిన్న అనంతపురం జిల్లా యాడికిలో యాత్ర నిర్వహించడానికి వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. అనంతపురం తమ కోటగా భావించే జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరుకుంటాడా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 కార్లతో జగన్ యాత్రను అడ్డుకోవడానికి వెళ్లారు. ఇక జేసీ నోటి గురించి చెప్పక్కర్లేదు. ఏది అనాలనిపిస్తే అది ముఖం మీద చెప్పేయడం.. తిట్టాలనిపిస్తే తిట్టేయడం వారి నైజం. ఈ క్రమంలోనే ఆయన జగన్ పై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చాడు. రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావని, ముఖ్యమంత్రిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈరోజు కదిరిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ఆయన యాత్రను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబుకు జగన్ క్షమాపణలు చెబితే కాని యాత్ర చేయడానికి వీల్లేదు అని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇక టీడీపీ సీనియర్ నేతలైతే జగన్ పై మండిపడుతున్నారు.  జగన్‌ మానసిక పరిస్థితి బాగోలేదని.. ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో జగన్‌కు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ప్రజలు రాళ్లతో కొట్టి ఇంటికి పంపుతారని అంటున్నారు. జగన్ ను ప్రజలు చెప్పులతో కొడతారు అని అంటున్నారు. మరి టీడీపీ తమ్ముళ్లు కోరినట్టు జగన్ క్షమాపణలు చెబుతారో లేదా చూడాలి.

By
en-us Political News

  
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.