వైయస్సార్ పిసి అభ్యర్థి గొల్ల బాబూరావుకు మంత్రి బాలరాజు ఆశీస్సులు?
Publish Date:Mar 13, 2012
Advertisement
విశాఖజిల్లా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు వచ్చే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ముప్పుతెచ్చేవిగా మారాయి. ఈ జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజుకు, గంటా శ్రీనివాసరావుకు మధ్య ప్రచ్చన్నయుద్ధం ప్రారంభమైంది. ఇది మరింత ముదిరి పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం వుంది. ఈ జిల్లాలో ఉన్న పాయకారావుపేట నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బాధ్యతంతా మంత్రి బాలరాజుకు అప్పగిస్తారని మొదట భావించారు. అయితే ఆయనకు బదులుగా ఇటీవల పిఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావుకు అప్పగించడంతో వివాదం తలెత్తింది. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినవారికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. పాయకారావుపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గొల్ల బాబూరావు మంత్రి బాలరాజుకు ఒక్కప్పుడు ప్రియశిష్యుడు. అందువల్ల బాలరాజుకు కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ఆయన మనస్పూర్తిగా పనిచేయకపోవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలిసింది. అందుకే గంటాకు ఈ బాధ్యతను అప్పగించినట్లు భావిస్తున్నారు. తనపై అనుమానంతో తనకు బాధ్యతలను అప్పగించనందుకు బాలరాజు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా ఆయన పరోక్షంగానైనా తన శిష్యుడు గొల్ల బాబూరావు విజయాన్ని కాంక్షించే అవకాశం ఉందని ఈ పరిణామాల నేపధ్యంలో కార్యకర్తలు అనుమానిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ysr-party-golla-baburao-24-12600.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





