కడప వీధుల్లో షర్మిల వర్సెస్ భారతి

Publish Date:Apr 29, 2024

Advertisement

వైసీపీకి కంచుకోట అయిన కడపలో ఆ పార్టీ ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఆ జిల్లాలో ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి ఎదురన్నదే లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ కుటుంబానికి జిల్లాపై అలాంటి సాధికారత లేకుండా పోయింది. అందుకు ప్రధాన కారణం ఇప్పుడా కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పరస్పరం పోటీ పడటమే. ఔను కడప జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పోరాడుతోంది. 

గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి రావడం కోసం, జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం కుటుంబం మొత్తం ఐక్యంగా నిలబడింది. జిల్లాలో ఫలితాలు అందుకు తగ్గట్టుగానే వచ్చాయి. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ల కిందట జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు వైఎస్ కుటుంబీకులే కావడం, ఆ అంశంపైనే కుటుంబం రెండుగా చీలిపోవడంతో జిల్లాలో పరిస్థితి తారుమారైంది. 

జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత చెల్లెలు షర్మిల అన్నతో విభేదించింది. న్యాయంగా తనకు రావలసిన కుటుంబ ఆస్తులను ఇవ్వకపోవడమే కాకుండా పార్టీలో తన ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించి, చవరకు పార్టీ నుంచే సాగనంపిన జగన్ కు వ్యతిరేకంగా ఆమె గళమెత్తారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను జగన్ వెనకేసుకు వస్తున్నారని ఆరోపిస్తూ, వివేకా కుమార్తె డాక్టర్ సునీత చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించి, ఆమెకు బాసటగా నిలిచారు. 

ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉంటే.. వైఎస్ షర్మిల అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఇక ఇదే లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ పోటీ చేస్తున్నారు.  

తన భర్తకు మద్దతుగా  వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. కడప లోక్ సభ అభ్యర్థిగా రంగంలో ఉన్న షర్మిల ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో కడప వీధుల్లో వైఎస్ భారతి, వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లోనే హైలైట్ గా నిలవనుంది.  ఇప్పటి  వరకూ అయితే వైఎస్ భారతి వ్యూహాత్మకంగా  షర్మిలపై నేరుగా ఎటువంటి విమర్శలూ చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం  భారతిపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైఎస్ భారతి కూడా షర్మిలపై డైరెక్టుగా విమర్శలు సంధించడానికి ఎక్కవ రోజులు తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. దీంతో తొలిసారిగా వైఎస్ కుటుంబ కోటకు బీటలువారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కడప ఫలితమే నిజమైన వైఎస్ రాజకీయవారసులెవరన్నది తేలుస్తుందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
బాబు సీఎం.. ఫిక్సయిపోండి!
జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
 ఎపిలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి  రిలీఫ్ అయ్యింది. మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.
ఏపీలో పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నికల సంఘం కూడా దీనిని అధికారికంగా ధృవీకరించింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు ఓటెత్తారు. అనూహ్యమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కనబరిచారు.
ఏపీలో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దారుణాలకు పాల్పడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎదిరించి నిలబడుతున్నారు.
వేసవి సెలవుల్లో సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి.. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారనే ఉద్దేశమే దీనికి కారణం. మూడు గంటలు ఏసీలో సినిమా ఎంజాయ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హాట్ సీట్ గా అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమేనని చెప్పవచ్చు. అటువంటి పిఠాపురంలో పోలింగ్ ముగిసిన తరువాత కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశా నిస్ఫృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.
ఆళ్ళగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ మీద హత్యాయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చేశారు.
సరిగ్గా ఎన్నికల వేళ ఐకాన్ స్టార్, మెగా హీరోలలో ఒకడు అయిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాను నంద్యాల వెళ్లి మిత్రుడికి మద్దతు తెలపడాన్ని అల్లు అర్జున్ సమర్ధించుకున్నాడు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు.ఒకే కుటుంబానికి ముగ్గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బుద్ధవనం-వారసత్వ ఉద్యానవనం అనేక పర్యాటక ప్రత్యేకతలతో, మన దేశంలోనే కాక, ఆసియా దేశాలో కూడా విలక్షణ బౌద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందని, బుద్ధవనం బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
ఏపీలో పోలింగ్ ముగిసింది. వైసీపీ మూకల అరాచకం, హింసాకాండ, బెదరింపులు, దాడులు ఇవేమీ పట్టించుకోకుండా జనం అపూర్వమనదగ్గ పట్టుదలతో ఓటు వేశారు. భారీ పోలింగ్ నమోదైంది. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.