వైకాపాకు కష్ట కాలం!

Publish Date:May 2, 2016

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దిల్లీలో అలా హడావుడి చేసి ఇలా తిరిగి వచ్చారో లేదో... తెలంగాణలో తన పార్టీ ఖాళీ అవనున్న విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. తెలంగాణలో వైకాపాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే, ఒకే ఒక్క ఎంపీ తెరాసలోకి మారడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. అటు పక్క ఆంధ్రాలో పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది! ఇందులో జగన్ స్వయంకృతం కూడా కొంత లేకపోలేదు.

 

సాక్షాత్తూ వైకాపా వెబ్‌సైట్‌ ప్రకారం ఆంధ్రాలో వారి ఎమ్మెల్యేల బలం 51. అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు... గడచిన రెండేళ్లలో దాదాపు 16 మంది ప్రతినిధులు పార్టీ నుంచి జారుకున్నారు. రోజూ ఉదయాన్నే లేచి ఎవరు పార్టీలో ఉన్నారు, ఎవరు గట్టు దాటనున్నారు అని తెలుసుకోవాల్సిన దుస్థితిలోకి అక్కడి వైకాపా జారిపోయింది. ఇతర  నేతలను తన పార్టీ వైపు లాక్కొని, నిదానంగా ప్రతిపక్షాలను ఖాళీ చేసే యుక్తి జగన్ తండ్రి వైఎస్‌ఆర్‌ కాలం నుంచే ఊపందుకుందని చెబుతారు. కాకపోతే ఇప్పుడు వైఎస్‌ఆర్‌ తనయుడే ఆ తంత్రానికి చిక్కుకోవడం ఓ వైచిత్రి.

 

పార్టీలో దాదాపు నాలుగో వంతు ఖాళీ అయిపోవడంతో కంగారుపడ్డ జగన్‌ హుటాహుటిన దిల్లీకి చేరుకున్నారు. ‘ఎంపరర్ ఆఫ్‌ కరప్షన్‌’ పేరుతో చంద్రబాబు మీద ఓ చిరుపుస్తకాన్ని ముద్రించి అక్కడి కనిపించినవారందరికీ పంచిపెట్టారు. పనిలో పనిగా తన ఎమ్మెల్యేలు అందరూ పసుపురంగు పులుముకుంటున్న విషయాన్ని కూడా ఏకరవు పెట్టారు. అసలు పార్టీని ఫిరాయించినవారి మీద స్పీకరు కాకుండా ఎన్నికల కమీషన్‌ నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్‌ చేశారు. కానీ జగన్‌ సూచనలను దిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్వయంగా పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి ఉన్న జగన్‌, చంద్రబాబు మీద ఆరోపణ చేయడంతో దిల్లీగణం లైట్ తీసుకున్నారు. ఇక పార్టీ ఫిరాయింపు గురించి కూడా బీజేపీ నేతలు అంత పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఉత్తరాఖండ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి వ్యవహారాలతోనే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

 

దిల్లీ మంత్రాంగం ఫలించకపోవడంతో ఉసూరుమంటూ తిరిగివచ్చిన జగన్‌కు అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలో మరికొందరు సభ్యలు గోడ దూకేందుకు సిద్ధంగా కనిపించారు. పైగా వైకాపాలో ఏకైక పెద్దదిక్కుగా ఉన్న మైసూరారెడ్డి కూడా వైకాపాను వీడటమే కాకుండా, వీడ్కోలు సమావేశంలో జగన్‌ మీద తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆంధ్రాలో వైకాపాకు ఛర్మిష్మాను అందించే నేతలు కరువైపోయారు. ప్రతిపక్ష సభ్యులు అధికారం కోసం వలసబాట పట్టడం కొత్తేమీ కాదు. ఇందుకు జగన్‌ ఒంటెద్దు పోకడలు, తన కంటే ఎత్తుగా మరో నేత కనిపించకూడదన్న పంతం ఫిరాయింపులకు కలిసివచ్చాయి. దానికి తోడు జగన్ ఎప్పుడు ఏ వైఖరిని ఎందుకు అవలంబిస్తారో తెలియని అయోమయం ఎలాగూ ఉంది. తెలంగాణలో వైకాపా తీరే ఇందుకు ఉదాహరణ! తొలుత అక్కడ వైకాపా, తెరాసతో వైరం ఎందుకన్నట్లు సుతిమెత్తటి ఆరోపణలతో సరిపుచ్చుకునేది. ఒకదశలో తెలంగాణలో వైకాపా, తెరాస మిత్రపక్షాలేమో అన్నంత అనుమానం కలిగేది. కానీ ఇంతలోనే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష, పాలేరు ఉప ఎన్నకలలో కాంగ్రెస్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో... తెరాస తన ఫిరాయింపు తంత్రాన్ని వైకాపు వైపు పారించింది. ఆ పార్టీకి ఉన్న ఇద్దరంటే ఇద్దరు ప్రజాప్రతినిధిలను తన వైపుకి మళ్లించుకుంది. ప్రస్తుతానికి తెలంగాణలో వైకాపా తన పార్టీని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో వైకాపాకు బలమైన క్యాడర్‌ నిర్మించగల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీకి దూరం కావడం నిజంగా జగన్‌కు శరాఘాతమే! తాజా పరిణామంతో తెలంగాణలో వైకాపాకు వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిపోయింది.

 

ఆంధ్రాలో పరిస్థితి కూడా వైకాపాకు ఏమంత స్థిరంగా కనిపించడం లేదు. అక్కడ ప్రత్యేక హోదా, కరువు, నిరుద్యోగం... లాంటి నానారకాల సమస్యలు ఉన్నా కూడా జగన్‌ వాటి మీద పోరాటం చేయకపోవడం విచిత్రం. అది మానేసి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులోను, ఫిరాయింపులకు వ్యతిరేకంగా దిల్లీలో ఎందుకు పోరాడుతున్నారో ఎవరికీ కొరుకుడపడని అంశం. అసలు సమస్యలని గాలికొదిలేసి కాపు రిజర్వేషన్‌ వంటి సమస్యలను సృష్టించడం , అరకొర అవినీతి ఆరోపణలు చేయడంతో వైకాపా నిబద్ధత మీదే ప్రశ్నలు చెలరేగాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో వైకాపా తరచూ వైఫల్యం చెందుతోందన్నది మరో ఆరోపణ. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశ సమయంలో వైకాపా తీరే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆ సమయంలో వైకాపా తీసుకున్న అవిశ్వాస తీర్మానం వంటి నిర్ణయాలు ఆ పార్టీనే ఇరుకున పెట్టాయి.

 

ఇప్పటికైనా వైకాపాకు సమయం మించిపోయింది లేదు. ఆ పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల నాటికైనా బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. అటు ఆంధ్రాలోనూ, ఇటు తెలంగాణలో పోరాడవలసిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి. వైకాపాలోకి చేరేందుకు దాసరి వంటి నేతలూ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విభజన విషయంలో కాంగ్రెస్‌ అంటే గుర్రుగానే ఉన్నారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపుతున్న బీజేపీ అన్నా మండిపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తెదెపాకు ప్రత్యామ్నాయంగా ఒక్క వైకాపానే కనిపిస్తోంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని వైకాపా తాను ప్రజల పక్షం అని నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణలో తెరాసది ఏకఛత్రాధిపత్యంలో మిగిలిపోయినట్లుగా, ఆంధ్రాలో తెదెపా దెబ్బకి కునారిల్లక తప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.