చిత్తశుద్ధి లేని పోరాటాలు ఎన్ని చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం?

Publish Date:Dec 3, 2014

Advertisement

 

తెలుగుదేశం పార్టీ అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, కానీ తను మాత్రం అధికారం కోసం అటువంటి అబద్దాలు చెప్పకపోవడంతో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఎన్నికలలో ఓడిపోయామని వై.యస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటినుండీ ఆయన ఇదే అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ధర్నాలు కూడా చేశారు, రేపు కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.

 

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతుల రుణాలమాఫీ కోసమే చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో ఈ ధర్నాలు చేస్తున్నారా? అని ప్రశ్నించుకొంటే కాదనే అర్ధమవుతోంది. అనేక కేసులలో నిందితుడుగా ఉన్న తనను ప్రజలు ఎందుకు తిరస్కరించారో గ్రహించకుండా, తన ఓటమి నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోకుండా, ఓదార్పు యాత్రల పేరుతో ఏవిధంగా తన పార్టీని బలోపేతం చేసుకొన్నారో అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయ రుణాలమాఫీ కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెపుతూ తన పార్టీని కాపాడుకొంటూ బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనే సంగతి ప్రజలు గ్రహించలేరని వైకాపా భావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం రుణాల మాఫీకి చేస్తున్న కసరత్తును చూస్తూ కూడా ధర్నాలు చేయాలనుకోవడం గమనిస్తే ఈ వ్యవహారంలో ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతూనే ఉంది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలనే తన చిరకాల కోరిక నెరవేరకుండా చంద్రబాబు అడ్డుపడ్డారనే దుగ్ధ ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయామని ఆయన పదేపదే చెప్పుకోవడమే అందుకు ఉదాహరణ. తనకు అధికారం దక్కకుండా చేసినందుకు చంద్రబాబుపై పగతో రగిలిపోతున్నందునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (చంద్రబాబు నాయుడు) మెడలు వంచుతానని భింకాలు పలుకుతున్నారని కూడా అర్ధమవుతూనే ఉంది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఆయన, తెలంగాణా ప్రభుత్వం, పోలవరం, నీళ్ళు, విద్యుత్, ఉద్యోగాలు, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్, ఇంటర్ మీడియేట్ పరీక్షల నిర్వహణ వంటి అనేక అంశాలలో ఆంద్ర రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తుంటే ఏమాత్రం స్పందించక పోవడం గమనిస్తే, వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పోరాటాలలో నిజాయితీ ఏపాటిదో అర్ధమవుతూనే ఉంది. పొరుగు రాష్ట్రం తన ప్రజలపై, ప్రభుత్వంపై ఇంత దాష్టికం చేస్తుంటే దానితో పోరాడే బదులు, దాని తరపునే వకల్తా పుచ్చుకొని ప్రజలెన్నుకొన్న ఆంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని జగన్మోహన్ రెడ్డి ప్రతిజ్ఞలు చేయడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన చేపడుతున్న ధర్నాలకు, దీక్షలకు ప్రజా స్పందన కొరవడుతోంది.

 

రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ, హుడ్ హుడ్ తుఫాను, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు కావేవీ విమర్శలకు, పోరాటాలకు అనర్హం అన్నట్లు ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తూ, వాటి నుండి రాజకీయ లబ్ది పొందేందుకు ఆరాటపడుతూ, ఇదంతా ప్రజల కోసమేనని ప్రజలను మభ్యపెడుతూ, తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు మూర్కులు వారికి ఏమీ అర్ధం చేసుకొనే శక్తి లేదనే చులకన భావం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనబడుతోంది.

 

ఆయన ఈవిధంగా చిత్తశుద్ధిలేని పోరాటాలు చేసినందుకే ఎన్నికలలో వైకాపాను ప్రజలు తిరస్కరించారు. అయినప్పటికీ నేటికీ ఆయన తీరు మారలేదని అర్ధమవుతోంది. ఆయన ఏమి చేసి తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారో అవే వైకాపాకు శాపంగా మారుతున్నాయని చెప్పవచ్చును. ఇదంతా చూస్తున్నప్పటికీ పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయలేక వైకాపాలో సీనియర్లు సైతం నిస్సహాయంగా చూస్తుండి పోయిన్నట్లుంది. ఇదంతా చూస్తుంటే వైకాపాకు ప్రధమ శత్రువు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేనని ఎవరికయినా అనిపించక మానదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.