తెలంగాణా యుద్దభూమిలోకి షర్మిలను పంపడం దేనికో?

Publish Date:Nov 17, 2014

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రల ద్వారా ప్రజలను ఆకట్టుకొని రాష్ట్రంలో తన పార్టీని బలపరుచుకోవాలనుకొన్నసంగతి అందరికీ తెలిసిందే. అయితే దానికి బదులు ఆయన గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేసి ఉండి ఉంటే ఆయన ఆశించిన ప్రయోజనం నెరవేరి ఉండేదేమో. కానీ అయన ఈ ‘షార్ట్ కట్’ పద్దతిలో పైకి ఎదగాలనుకోవడం వల్లనే నేటికీ పార్టీ అనేక జిల్లాలలో చాలా బలహీనంగా మిగిలిపోయింది. అయితే ఆయన గతం నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోలేదని ఆయన సోదరి షర్మిల త్వరలో తెలంగాణా చేపట్టబోతున్న ‘పరామార్శ యాత్ర’ దృవీకరిస్తోంది.

 

కష్టాల్లో ఉన్నవారిని పరామార్శించడాన్ని ఎవరూ కూడా తప్పు పట్టరు. కానీ వారి కష్టాలను తన రాజకీయ లబ్ది కోసం వాడుకోవడాన్ని ఎవరూ సమర్ధించబోరు. తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటున్న వైకాపా అందుకోసం ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నలను, పంటలకు నీళ్ళందక కన్నీళ్ళు పెట్టుకొంటున్న రైతన్నలను పరామార్శించే సాకుతో యాత్రలు చెప్పట్టాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచనని చెప్పక తప్పదు. (రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు).

 

తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటే అందుకు నేరుగానే ప్రయత్నాలు చేసుకోవచ్చును. తెలంగాణాలో మిగిలిన పార్టీనేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి పార్టీని మళ్ళీ ఈవిధంగా బలపరుచుకోవాలని చర్చించాలని ప్రయత్నించే బదులు కష్టాల్లో ఉన్న రైతులకు సానుభూతి చూపిస్తూ అందుకు ప్రతిగా తిరిగి వారి నుండి పార్టీ సానుభూతి పొందాలను కోవడం ఆ పార్టీకి రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఎటువంటిదో స్పష్టం చేస్తోంది. ఈవిధమయిన ఆలోచనలు చేయడాన్ని ఎవరూ కూడా హర్షించరు...సమర్దించలేరు కూడా. ముఖ్యంగా తెలంగాణా ప్రజలు.

 

ఒకప్పుడు తెలంగాణా ప్రజల సెంటిమెంటు గౌరవిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కనీసం తన పార్టీ నేతలయిన కొండా సురేఖ వంటి తెలంగాణా నేతల మనోభావాలను కూడా గౌరవించకుండా, వారి సలహాలను పెడచెవిన పెట్టి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ తెలంగాణా నుండి బయటపడ్డారు. ఆవిధంగా చేసి తెలంగాణా ప్రజల, తన పార్టీ నేతల మనసు నొప్పించిన జగన్మోహన్ రెడ్డి, సమైఖ్యాంధ్ర శంఖం పూరించి సీమాంధ్ర ప్రజల ఓట్లు పిండుకొందామని చేసిన ప్రయత్నం కూడా ఫలించక పోవడంతో ఆయన పార్టీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయింది. అందుకే ప్రజలు కూడా ఆ పార్టీని, అది చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని కూడా అనుమానంగానే చూస్తుంటారు. అయినప్పటికీ ఆ పార్టీ అధినేత గతం నుండి ఎటువంటి గుణపాటాలు నేర్చుకోకుండా మడమ తిప్పకుండా అదే పద్దతిలో ముందుకు సాగాలనుకోవడం విశేషమే. అందుకు పార్టీతో ఎటువంటి సంబంధం లేని షర్మిల సేవలను ఉపయోగించుకోవాలనుకోవడము కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో ఉన్నపుడు, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఇరువురు ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేసారు. అందులో వారు చాలా వరకు సఫలీకృతులయ్యారు కూడా. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీని చూసుకొంటునప్పుడు తను వెళ్ళకుండా షర్మిలను పంపిస్తున్నారు. ‘యుద్దంలో దిగినవాడికి గుండెల నిండా దైర్యం ఉండాలి’ అని గొప్పగా చెప్పుకొనే ఆయన పార్టీకి పూర్తి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న తెలంగాణా యుద్దభూమిలోకి తను వెళ్ళకుండా చెల్లెలు షర్మిలను పంపించడం దేనికంటే అక్కడ ప్రజా వ్యతిరేఖతను తను తట్టుకోలేననే ఆలోచనతోనే అని చెప్పక తప్పదు. ఆమె పర్యటనతో పరిస్థితి కొంచెం మెరుగుపడితే బహుశః అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం చేస్తారేమో? కానీ షర్మిల వంటి వారు పార్టీని బలోపేతం చేయడానికి ఎంతగా కృషి చేసినప్పటికీ, పార్టీలో “విశ్వసనీయత” లేకపోతే అది ఎన్నటికీ ప్రజల ఆదరణకు నోచుకాదు. అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ద్వంద వైఖరిని విడనాడటం చాలా అవసరం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.