మా భూమి పట్టా పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు? పులివెందులలో వైఎస్ భారతిని నిలదీసిన రైతు!

Publish Date:Apr 30, 2024

Advertisement

కడప రాజకీయం మారిపోతోంది. ఆ జిల్లాలో వైఎస్ జగన్ ఆధిపత్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. అసలు వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

అందులోనూ ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన కడపలో ఈ ధిక్కారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ పులివెందులలో పర్యటించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో జనం నియోజకవర్గ సమస్యపై నిలదీశారు. నిరసన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తుతో పరదాల చాటున తిరిగే జగన్ కు ప్రజలు పరదాలను చీల్చుకుని మరీ ఎదురుపడి నిలదీయడం ఇబ్బందికరంగా మారింది. అప్పట్లొ ఆయన జనం ప్రశ్నలకు తనదైన ప్రత్యేక చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా వెళ్లి పోగలిగారు. కానీ ఎన్నికల వేళ ఆయన తరఫున నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతికి మాత్రం అటువంటి వెసులుబాటు దక్కలేదు. జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని వదిలించుకు వెళ్లలేక తలవంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఔను భర్త జగన్ కోసం ప్రచారం చేస్తున్న వైఎస్ భారతికి ఓ సామాన్యుడు బాంబు లాంటి ప్రశ్న సంధించాడు. మా తాతముత్తాతల నుంచీ నాకు సంక్రమిచిన భూమి పట్టాపై ముఖ్యమంత్రి జగన్ పొటో ఎందుకని అతడు నిలదీశారు. ఆ వ్యక్తి పేరు భాస్కరరెడ్డి. అంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అంతే కాదు..ఆయన వైసీపీకి చెందిన వ్యక్తే. కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్మరంపల్లె వచ్చిన భారతి మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్లి జగన్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. అయితే భాస్కరరెడ్డి, తమ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాన్ని చూపుతూ తన భూమి పట్టాపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు అని నిలదీశారు. అలాగే రైతు భరోసా పేరుతో జగన్ రైతులకు ఇస్తున్నదేమిటని నిలదీశారు. రైతు భరోసాలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందనీ, మరి జగన్ చేసిందేమిటని ప్రశ్నించారు. రైతు భరోసా సొమ్ములు పెంచాల్సిందిగా జగన్ కు చెప్పాలని భారతిని కోరారు. భాస్కరరెడ్డి సంధించిన ఈ ప్రశ్నలలో వేటికీ వైఎస్ భారతి సమాధానం చెప్పలేదు. భాస్కరరెడ్డి నిలదీస్తున్నంత సేపూ మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత మాట్లాడకుండా అక్కడ నుంచి కదిలి వెళ్లిపోయారు.

సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలకు ప్రజల నుంచి డిమాండ్లు ఎదురు కావడం సహజమే. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ నిరసనలు ఎదురుకావడం కూడా కద్దు. అయితే పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని నిలదీసి ప్రశ్నించడం అంటే అదో అసాధారణ ఘటనే. అదీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని నిలబెట్టి ప్రశ్నించడం అన్నది ఎవరూ ఊహించను కూడా ఊహించలేరు. కానీ సోమవారం పులివెందులలో ప్రచారం సందర్భంగా ఈ చేదు అనుభవం సీఎం సతీమణికి ఎదురైంది. ఈ ఒక్క సంఘటన చాలు పులివెందుల నియోజకవర్గంలో జగన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని చెప్పడానికి.  వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావడం, దానికి ఎత్తి చూపుతూ సొంత చెల్లి జగన్ పై విమర్శలు గుప్పించడంతో ఆ కుటుంబంలో చీలిక వచ్చిందనీ, నియోజకవర్గ ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారనీ ఈ సంఘటనను ఉదహరిస్తూ స్థానికులు చెబుతున్నారు.   

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్ 15
ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. పోనీ వంద కూడా కాదు.. ఏకంగా 570 రాళ్ళున్నాయి.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది. 2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది
 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది. 
 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది
ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద వున్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది. అయిదేళ్ళపాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి...
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.