ముష్టి 350 కోసం జగనన్న ప్రాణాలతో ఆడుకున్నారు కదరా!

Publish Date:Apr 17, 2024

Advertisement

ఏవయ్యా విజయవాడ వైసీపీ నాయకులు, కార్యకర్తలూ.. మీరు మన ప్రియతమ నాయకుడు జగనన్న ప్రాణాలతో ఆడుకున్నారు కదరా! మీరు ఆ రాయి విసిరిన పిల్లోడికి కమిట్ అయిన ఆఫ్ట్రాల్ 350 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల ఎంత దారుణం జరిగిందో చూశారుగా. ముందుగా ఒక పాయింట్ ఏంటంటే, ఆ రాయి విసిరిన పిల్లోడిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒలింపిక్స్.కి రికమండ్ చేయాల్సిన అవసరం వుంది. ఆ పిల్లోణ్ణి ఒలింపిక్స్.లో ఏ గురిచూసి కొట్టే పోటీలోనో ఆడిస్తే మన దేశానికి గోల్డ్ మెడల్ ఖాయంగా వస్తది. ఆ చీకట్లో, ఆ జనంలో, వాహనం మీద అంతమంది వుండగా, కరెక్ట్.గా జగనన్న ముఖానికే తగిలే విధంగా రాయి విసిరాడు చూడూ.. టాలెంటంటే వాడిదిరా. సరే, ఇక అసలు పాయింట్లోకి వెళ్తే, జగనన్న పేరు చెప్పుకుని జనాలను పీడించి బాగానే కోట్లకు కోట్లు సంపాదించుకున్నారుగా. ఆల్రెడీ ఆ పిల్లోడికి క్వార్టర్ బాటిల్ ఇచ్చారుగా, దానితోపాటు ఇంకో 350 రూపాయలు ఇస్తే మీ సొమ్మేం పోయేదిరా సచ్చినోళ్ళారా. మీరు కమిట్ అయింది ఇవ్వలేదు.. దాంతో ఆ పిల్లోడు మీ నాయకుడి మీద రివెంజ్ తీర్చుకున్నాడు. 
ఆ పిల్లోడు విసిరిన రాయి కంటికి కొంచెం పైన తగిలి చిన్న గాయం అయి, జగనన్న ప్లాస్టర్ వేసుకోవడానికి అనుకూలంగా కూడా వుంది కాబట్టి సరిపోయింది. అదే రాయి జగనన్న కంటికి తగిలితే పరిస్థితి ఏంటి? జగనన్న జీవితాంతం గాజు కన్నుతోనే వుండాల్సి వచ్చేది. జీవితమంతా ఎడమవైపు ఎవరున్నారో తెలియకుండా పోయేది. సరే, కంటి విషయం వదిలేయండి, అదే రాయి జగనన్న మూతికి తగిలి వుంటే పరిస్థితి ఏంటి? ఆయన మూతి ఆంజనేయ స్వామి మూతి లాగా వాచిపోయి వుండేది. వారం రోజులపాటు బయటకి వచ్చే అవకాశం వుండేది కాదు. అసలే ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా బ్రేక్ వస్తే బాగుంటుందా చెప్పండి. ఒకవేళ వాచిపో్యిన మూతితోనే ఆయన మాట్లాడితే వినేవాళ్ళకు, చూసేవాళ్ళకి ఎంత కామెడీగా వుండేదో తెలుసా? 
సరే, మూతి కూడా వదిలేయండి. ముక్కుకు తగిలితే పరిస్థితి ఏంటి? ముక్కు పచ్చడి అయిపోయి, ముక్కు చీదుకోవడానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితి తయారయ్యేది. జగనన్న ముక్కుకి బ్యాండేజ్ కట్టడం కూడా చాలా కష్టం.. అలాంటి పరిస్థితుల్లో జగనన్న ఎంత ఇబ్బంది పడేవారో మీరు అర్థం చేసుకున్నారా?
సరే, ముక్కు కూడా వదిలేయండి, రాయి డైరెక్ట్.గా వెళ్ళి జగనన్న చిన్న మెదడుకు తగిలి వుంటే, ఆయన చిన్నమెదడు చిట్లిపోయి వుంటే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో తెలుసా? జగన్ జ్ఞాపకశక్తి అంతా తుడిచిపెట్టుకుని పోయి వుండేది. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ వున్నాయో కూడా మర్చిపోయి వుండేవాడు. ఎవర్నీ గుర్తుపట్టలేకపోయేవాడు. వచ్చిన కాస్తా కూస్తా తెలుగు కూడా మర్చిపోయి ఏదో వింత భాష మాట్లాడేవాడు. మన పార్టీ మహిళామణులు బాధపడుతున్నట్టు ఆ రాయి డైరెక్ట్.గా వచ్చి జగనన్నకి ‘తగలరాని చోట’ తగిలినట్టయితే పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా తయారయ్యేదో ఒక్కసారి ఊహించండి. అందువల్ల, ఈసారి ఎవరికి ఎంత కమిట్ అయితే ఇచ్చేయండి. మీరు డబ్బుకోసం కక్కుర్తి పడి జగనన్న ప్రాణాల మీదకి తీసుకురాకండి.

By
en-us Political News

  
ఏపీలో ఎన్నికల తేదీ రోజుల్లోకి వచ్చేసింది. కచ్చితంగా చెప్పాలంటే మరో 14 రోజుల్లో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల హీట్ రోహిణీకార్తె ఎండలను మించిపోయింది. పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలైపోయి ఉన్నాయి. పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వేరే లెవెల్ లో కనిపిస్తోంది. దీంతో అధికార వైసీపీలో ఓటమి భయం కూడా స్పష్టంగా కానవస్తోంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 30)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి
దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు. 
ఎన్నికల వేళ ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.  
ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు.
వల్లభనేని వంశి నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ కు ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. అంతుకు ముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే, జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది
చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు..
​వనపర్తి జిల్లా భూత్పూరు గ్రామానికి చెందిన రైతు శేఖర్ ఆదివారం నాడు తన పొలానికి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.