గన్నవరం పంచాయతీకి ఎండ్ కార్డ్... భవిష్యత్తులో తలనొప్పులు తప్పవా?

Publish Date:Nov 19, 2019

Advertisement

 

గన్నవరం వైసీపీలో తీవ్ర కలకలం రేపిన వల్లభనేని వంశీ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడింది. వల్లభనేని వంశీ రాకను మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ దొరికింది. కృష్ణాజిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితోపాటు జగన్మోహన్ రెడ్డిని కలిసిన యార్లగడ్డ... వల్లభనేని వంశీ ఇష్యూపై అరగంటకు పైగా చర్చలు జరిపారు. అయితే, జగన్ దగ్గర కూడా వంశీ రాకపై యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, గన్నవరంలో పరిస్థితులను, ఎన్నికల సమయంలో వంశీ బెదిరింపులను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పార్టీ కోసం పని చేయాలని, మీ రాజకీయ భవిష్యత్తుకు నాదీ భరోసా అంటూ జగన్ హామీ ఇవ్వడంతో యార్లగడ్డ మెత్తబడినట్లు తెలుస్తోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డే హామీ ఇవ్వడంతో వంశీతో కలిసి పనిచేసేందుకు యార్లగడ్డ ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది.

కేవలం 900 ఓట్ల తేడాతో ఓడిపోవడం, వంశీకి యార్లగడ్డ గట్టి పోటీనివ్వడంతో, ఇరువురికి ఆమోదయోగ్యమైన ఫార్ములాతో గన్నవరం పంచాయతీకి ముగింపు పలికినట్లు చెబుతున్నారు. జగన్ సిద్ధాంతం ప్రకారం వల్లభనేని వంశీ... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే, వైసీపీలో చేరాల్సి ఉంటుంది. అలా వంశీ రాజీనామా చేశాక, గన్నవరం నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే... యార్లగడ్డను బరిలోకి దింపాలనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. ఇక, వంశీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ, వంశీకే మళ్లీ గన్నవరం బాధ్యతలు అప్పగించి, ఉపఎన్నిక బరిలోకి దింపితే, యార్లగడ్డ భవిష్యత్తు ఏమిటని వెంకట్రావు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అందుకే, వల్లభనేని వంశీ రాకను యార్లగడ్డ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇక, ఎన్నికల సమయంలోనూ, ఫలితాలకు ఒకట్రెండు రోజుల ముందువరకు కూడా యార్లగడ్డ, వంశీ మధ్య ఓ రేంజ్ వార్ నడిచింది. యార్లగడ్డ ఇంటికి తన అనుచరులను పంపడం... యార్లగడ్డకు ఫోన్లు చేయడం... లాంటి పనులతో వంశీ బెదిరింపులకు దిగారు. అయితే, ఇటీవల జగన్ ను కలిసిన తర్వాత కూడా యార్లగడ్డపై విరుచుకుపడ్డ వంశీ... ఇళ్ల పట్టాలు ఫోర్జరీ చేశానంటూ తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండానే తనపై కేసు నమోదు చేశారని, దీనిపై గవర్నర్, హైకోర్టు సీజేకి ఫిర్యాదు చేస్తానన్ని చెప్పుకొచ్చారు. అయితే పది రోజులు తిరక్కుండానే మీడియా ముందుకొచ్చిన వంశీ... జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే, యార్లగడ్డతో కూడా కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయితే, వైసీపీలో చేరకముందే ఆ పార్టీలో కాకపుట్టించిన వల్లభనేని వంశీ ముందుముందు ఇంకెన్ని తలనొప్పులు తెస్తాడోనని మాట్లాడుకుంటున్నారు. జగన్ మాటను కాదనలేక ఒప్పుకున్నా... వంశీ రాకను యార్లగడ్డ జీర్జించుకోలేకపోతున్నారనే అంటున్నారు. దాంతో, ముందుముందు వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయోనన్న చర్చ గన్నవరం వైసీపీలో జరుగుతోంది. మరి, వంశీ-యార్లగడ్డ సమైక్య రాగం ఆలపిస్తారో? లేక వేర్వేరు కుంపట్లతో వైసీపీకి తలనొప్పిగా మారతారో చూడాలి.

By
en-us Political News

  
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.