రోజాకు షాక్ ఇచ్చిన జగన్ ..ప్రత్యర్థి వర్గానికి కార్పొరేషన్ పదవి

Publish Date:Oct 1, 2020

Advertisement

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజాకి వైసీపీలో పవర్ తగ్గిపోతోందా?.. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా, ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే పవర్ చూపించలేకపోతున్నారా?.. పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

 

రోజా వ్యతిరేక వర్గానికి చెందిన కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి ఇవ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. మంత్రి పెద్దిరెడ్డి చొరవతో కేజే కుటుంబానికి పదవి దక్కినట్టు ప్రచారం జరుగుతోంది.

 

నగరిలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే రోజాకు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య విభేదాలున్నాయి. గతంలో కేజే అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు. కెబిఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజకి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా కేజే అనుచరులు ఆమెను అడ్డుకొని, కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు రోజా వారిపై ఫిర్యాదు కూడా చేశారు.

 

అంతేకాదు, గతంలో కేజే కుమార్ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు ఎవరూ హాజరుకావొద్దంటూ.. అప్పట్లో ఆమె పార్టీ కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశం వైసీపీలో కలకలం రేపింది. అయితే, పార్టీ శ్రేణులు ఎవరూ హాజరుకావొద్దని రోజా కోరగా.. ఆ కార్యక్రమానికి ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు హాజరయ్యారు.

 

ఇక, ఈ ఏడాది మే నెలలో పుత్తూరులో కళ్యాణ మండపం నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం నారాయణస్వామి అధికారులతో స్థలాన్ని పరిశీలించారు. అయితే, తన నియోజకవర్గంలో స్థలాన్ని పరిశీలించడానికి వస్తూ తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై రోజా అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇలా ఈ ఏడాది కాలంలో అనేకసార్లు రోజా మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒకవైపు తన వైరి వర్గానికి మద్దతుగా నిలుస్తూ, మరోవైపు తనకి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నియోజకవర్గ ప్రజల్లో తనను పలుచన చేస్తున్నారన్న అసహనం రోజాలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పుడు కూడా కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంపై రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కావాలని తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పెద్దిరెడ్డి, నారాయణస్వామిలపై రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట.

 

వైసీపీ అధికారలోకి వస్తే తనకి మంత్రి పదవి దక్కుతుందని రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె ఆశలపై జగన్ నీళ్ళు చల్లారు. ఆమెని కాదని పెద్దిరెడ్డి, నారాయణస్వామిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో రోజా అప్పట్లో తీవ్ర అసంతృప్తికి లోనై కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. చివరికి కంటితుడుపు చర్యగా ఆమెకి ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే, ఆ పదవితో ఆమె సంతృప్తిగా లేరని తెలుస్తోంది. దీనికితోడు పెద్దిరెడ్డి, నారాయణస్వామి మద్దతుతో వైరి వర్గం రోజురోజుకి బలపడుతుండటం, ఆమె నియోజకవర్గంపై పట్టు కోల్పోతుండటంతో తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇంతకాలం మంత్రుల పెత్తనాన్ని భరిస్తూ వచ్చిన రోజా.. ఇప్పుడు కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారట. అవసరమైతే ఈ విషయంపై జగన్ తోనే తేల్చుకోవాలని రోజా అనుకుంటున్నారని సమాచారం. దీంతో ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో నెలకొంది.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.