political-news-img

డ్రగ్స్ కేసులో ముంబై నటుడు సహా ఆరుగురు అరెస్ట్ : ఈగిల్ టీం

డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ తారామతి బారాదరి రిసార్ట్‌లో జరిగిన పార్టీపై ఈగిల్ ఫోర్స్ ఆకస్మిక దాడి నిర్వహించామని ఈగిల్ టీం అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలి పారు.నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్లోని తారామతి బారాదరి రిసార్ట్‌లో నిర్వహించిన ప్రత్యేక పార్టీపై ఈగిల్ ఫోర్స్ బృందం సోదాలు చేపట్టామని తెలిపారు “More Than Friends” పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ ఈ పార్టీని నిర్వహించినట్లు గుర్తించామని ఈగిల్ టీం అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుని పార్టీకి హాజరైనట్లు గుర్తించిన వారిలో ముంబైకి చెందిన నటుడు& మోడల్ సర్వర్ ప్రధానంగా ఉన్నాడు. అతడితో పాటు ప్రముఖ డీజే జాన్సన్ తో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు.. ఈ పార్టీకి ప్రముఖ ముంబై మరియు టాలీవుడ్ సినీ వర్గాలకు చెందిన పలువురు హాజరయ్యారు. ఈ పార్టీలో అనుమానం ఉన్న 35 మందికి డ్రగ్స్ టెస్టులు చేశాం... అందులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.. దీంతో నటుడు సర్వర్, స్పైసెస్ వ్యాపారి నీహార్, వ్యాపారవేత్త నీహర్ భార్య ఆశి, డీజే జాన్సన్, వ్యాపారవేత్త యోగేశ్వర్, ఫార్మాస్యూటికల్ అనలిస్ట్ అవినాష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు... వీరంతా డ్రెస్ తీసుకున్నట్లుగా అంగీకరించారు..వారిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశాము డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ టీం దర్యాప్తు కొనసాగుతుంది.డ్రగ్స్ వినియోగంపై మరింత సమాచారం సేకరిస్తున్నా మని... హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు.

Publish Date: Apr 5, 2026 5:52PM

political-news-img

హైకోర్టు జోన్-II భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్‌లో నిర్మించ తలపెట్టిన నూతన హైకోర్టు భవన సముదాయంలోని జోన్-2 నిర్మాణ పనులకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సమీక్షించారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొత్త హైకోర్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రధాన భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగా, రెండో దశలో భాగంగా న్యాయమూర్తుల నివాస గృహాలు (క్వార్టర్స్), విల్లాలు మరియు ఇతర అనుబంధ సౌకర్యాల కోసం జస్టిస్ సూర్యకాంత్ పునాది రాయి వేశారు. సుమారు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు మెరుగైన న్యాయ మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని ఆకాంక్షించారు. న్యాయవాదులకు, కక్షిదారులకు మరియు సిబ్బందికి అన్ని రకాల ఆధునిక వసతులు ఒకే చోట లభించేలా ఈ ప్రాముఖ్యత కలిగిన జోన్-2 డిజైన్ చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 1,550 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం న్యాయవ్యవస్థ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పర్యావరణ హితంగా, అధునాతన సాంకేతికతతో ఈ భవనాలను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. గతంలోనే భూమి పూజ నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పుడు సీజేఐ సమక్షంలో తదుపరి దశ పనులను వేగవంతం చేసింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు చెందిన పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన హైకోర్టు అందుబాటులోకి వస్తే పాత భవనంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, పెరుగుతున్న కేసుల విచారణకు అవసరమైన అదనపు కోర్టు హాళ్లు అందుబాటులోకి వస్తాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.వచ్చే రెండేళ్ల కాలంలో ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసి, హైకోర్టు కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచే నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక భవన నిర్మాణం హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలుస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Publish Date: Apr 5, 2026 5:36PM

political-news-img

డీసీఎం బీభత్సం... భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.కేరళకు చెందిన హానియా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మహేశ్వరం సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ మలబార్ గోల్డ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. సినిమా చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మాదాపూర్ మైండ్‌స్పేస్ సమీపంలోకి రాగానే, వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వారి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం తరువాత స్కూటీ డీసీఎం కింద ఇరుక్కుపోయింది. అయినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా, మహిళను స్కూటీతో పాటు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై డీసీఎంను అడ్డుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ను పట్టుకుని కొట్టిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించగా, ఆయేషా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అబ్దుల్ బాసిత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

Publish Date: Apr 5, 2026 5:21PM

political-news-img

ఇరాన్‌లో యూఎస్ పైలట్‌ని రక్షించిన దళాలు...ట్రంప్ హర్షం

శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలట్‌ను అమెరికా దళాలు రక్షించాయని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన యుద్ధ విమానం 'ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్' ఇరాన్ భూభాగంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండో పైలట్ ఇరాన్‌లో చిక్కుకుపోయాడు. అతడిని పట్టుకునేందుకు ఒకవైపు ఇరాన్ దళాలు, మరోవైపు అమెరికా సైన్యం తీవ్రంగా శ్రమించాయి. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను అమెరికా సైన్యం నిర్వహించి, పైలట్‌ను కాపాడిందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా సైన్యం ఆధీనంలో సురక్షితంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకర పర్వత ప్రాంతంలో అతడిని గుర్తించినట్టు తెలిపారు. పైలట్‌ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపానని ట్రంప్ తెలిపారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ విషయాన్ని బయటకు చెప్పలేదన్నారు. శత్రువు భూభాగంలోకి వెళ్లి ఓ పైలట్‌ను రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని ట్రంప్ పేర్కొన్నారు. ఏ అమెరికన్ యోధుడినీ శత్రు భూభాగంలో ఒంటరిగా వదలిపెట్టబోమని ట్రంప్ అన్నారు. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగు లేని ఆధిపత్యాన్ని సాధించిందని చెప్పడానికి తాజా ఆపరేషన్ ఓ నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు.

Publish Date: Apr 5, 2026 5:10PM

political-news-img

ఫ్రిడ్జ్ పేలి ఇద్దరి దుర్మరణం

తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహాలక్ష్మి వాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో ఉన్న ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న విజయ్ మరియు మరో మహిళ మంటల్లో చిక్కుకున్నారు. వారు గట్టిగా అర్తనాదాలు చేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించారు. మంటలు తీవ్రంగా వ్యాపిస్తూ దట్టమైన పొగలు బయటకు రావడంతో, స్థానికులు ఇద్దరినీ బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫ్రిడ్జ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Publish Date: Apr 5, 2026 4:55PM

political-news-img

అమెరికాలో ఇరాన్ గూఢచారి నెట్‌వర్క్‌పై నిఘా...సులేమానీ బంధువుల అరెస్ట్

ఇరాన్ సైనిక విభాగం 'రివల్యూషనరీ గార్డ్స్' మాజీ అధిపతి, దివంగత జనరల్ ఖాసీం సులేమానీకి చెందిన ఇద్దరు బంధువులను అమెరికా ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వారి నివాస అనుమతులను (గ్రీన్ కార్డులు) రద్దు చేసిన వెంటనే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అరెస్టయిన వారిలో ఖాసీం సులేమానీ మేనకోడలు హమీదా సులేమానీ అఫ్షర్, ఆమె కుమార్తె ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరు అమెరికాలో ఉంటూనే ఇరాన్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా అమెరికా వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని అధికారులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం వీరిద్దరినీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కస్టడీకి తరలించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. హమీదా అఫ్షర్ ఇరాన్ ఉగ్రవాద పాలనకు బహిరంగ మద్దతుదారుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. లాస్ ఏంజిల్స్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూనే, అమెరికాను 'గ్రేట్ సాతాన్' అని దూషించడం, ఇరాన్ సుప్రీం లీడర్‌ను పొగడటం వంటి చర్యలకు పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు జారీ చేసిన 'లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్' (LPR) హోదాను రద్దు చేశారు. మరోవైపు, ఇరాన్ మాజీ భద్రతా అధికారి అలీ లారిజానీ కుమార్తె ఫాతిమా అర్దేషిర్, ఆమె భర్త సెయ్యద్ మొతమేదిల గ్రీన్ కార్డులను కూడా అమెరికా రద్దు చేసింది. ఇప్పటికే వీరిని దేశం నుంచి బహిష్కరించినట్లు సమాచారం. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో, అమెరికా గడ్డపై ఇరాన్ అనుకూల శక్తులకు తావులేదని శ్వేతసౌధం స్పష్టమైన సంకేతాలు పంపింది. అయితే, ఈ అరెస్టులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఖాసీం సులేమానీ కుమార్తె జైనాబ్ ఈ వార్తలను ఖండించారు. అమెరికాలో అరెస్టయిన వ్యక్తులకు తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. సులేమానీ బంధువులెవరూ అమెరికాలో నివసించడం లేదని, ఇదంతా అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారమని ఇరాన్ మీడియా పేర్కొంది. 2020లో బాగ్దాద్‌లో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో ఖాసీం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న ఇతర ఇరాన్ పౌరుల నివాస అనుమతులపై కూడా ట్రంప్ ప్రభుత్వం పునఃసమీక్ష చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరెస్టులు రానున్న రోజుల్లో ఇరాన్-అమెరికా సంబంధాలను మరింత దిగజార్చేలా కనిపిస్తున్నాయి.

Publish Date: Apr 5, 2026 4:21PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img