జగన్ పార్టీలో ఆ ‘రెడ్డి’గారికి ఎందుకంత ఇంపార్టెన్స్?

Publish Date:Jun 27, 2017

Advertisement

 

జగన్ తన రాజకీయ చదరంగంలో ఎవ్వర్నీ నమ్మడని ఒక వాదన వుంది! పార్టీలో ప్రతీ నిర్ణయం తనే స్వయంగా తీసుకుంటాడు. ఎంతటి దగ్గరి బంధువులైనా, సీనియర్ నేతలైనా జగన్ కు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. అంతిమ నిర్ణయం ఆయనే తీసుకుంటాడు. ఎవ్వర్నీ అంత తేలిగ్గా నమ్మడు. ఇది ఒట్టి మాట కాదు… చాలా వరకూ నిజమే!

 

జగన్ తన వైసీపీలో ఇప్పటి వరకూ నెంబర్ టూ అంటూ ఎవరూ లేకుండా చూసుకున్నాడు. బోలెడు మంది సీనియర్లు వున్నా, ఇంట్లోంచి తల్లి విజయమ్మా, చెల్లెలు షర్మిలా కూడా పార్టీలో వున్నా… ఎవ్వర్నీ తనంత స్థాయిలో వుంచలేదు. కాని, తాజాగా జగన్ ఒక వ్యక్తికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ, అతడికి ఎక్కడలేని పవర్ ఇచ్చేస్తున్నాడని వైసీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆయనే వైసీపీ లో నెంబర్ టూగా కూడా మారిపోయారని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? జగన్ ఆర్దిక రహస్యాలన్నీ తెలిసిన ఆడిటర్ విజయసాయి రెడ్డి!

 

విజయసాయి రెడ్డి అంటే కొన్నాళ్ల కిందటి వరకూ జగన్ ఆర్దిక వ్యవహారాలు చూసే సీఏ అనుకునేవారు. కాని, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఆయన జగన్ రాజకీయ వ్యవహారాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు. వైసీపీ ఎంపీగా వున్న విజయసాయి రెడ్డి దిల్లీలో జగన్ కోసం బాగానే కష్టపడుతున్నారు. తెర వెనుక రాచకార్యలు చక్కబెడుతూ మోదీతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయించారు ఆ మధ్య! తరువాతే , జగన్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి బేషరతుగా మద్దతు పలికారు.

 

జగన్ తరుఫున దిల్లీలో పరిస్థితులు చక్కబెడుతున్న విజయసాయి రెడ్డి ఏపీలో కూడా ఖాళీగా వుండటం లేదు. జగన్ కు ఈ మధ్య కాలంలో సర్వం తానే అయిపోయాడంటున్నారు. ఒకప్పుడు వైసీపీలో యాక్టివ్ గా వున్న రాజశేఖర్ రెడ్డి భార్యా, జగన్ తల్లి విజయమ్మ ఇప్పుడు ఇళ్లు దాటి బయటకి రావటం లేదు. జగనన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల కూడా యుద్ధ రంగం నుంచి తప్పుకుంది. ఇక జగన్ బంధువులుగా ఫ్యాను పార్టీలో కీలకంగా మెలిగిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమ జిల్లా వదిలి రావటం లేదు.

 

జగన్ దీక్షలు, ధర్నాలు దగ్గరుండి చూసుకున్న సజ్జల రామకృష్ణా రెడ్డి, మైసూరా రెడ్డి, సోమయాజులు లాంటి సీనియర్లు కూడా ఈ మధ్య జగన్ పరిసరాల్లో కనిపించటం లేదు. అంతా విజయసాయి రెడ్డే హ్యాండిల్ చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం! మరి సడన్ గా విజయసాయి రెడ్డి హవా మొదలవటానికి కారణం ఏంటి? ఆయనకు ఆర్దిక వ్యవహారాల్లో వున్న జ్ఞానం, రాజకీయాలపై వున్న అవగాహన, ఇవి కాకుండా దిల్లీ పెద్దల్ని సైతం హ్యాండిల్ చేసే నేర్పు ఇప్పుడు బాగా పనికి వస్తున్నాయని అంటున్నారు. కేవలం విజయ సాయి రెడ్డి మాత్రమే తనకు విజయం చేకూర్చి పెట్టగలరని జగన్ భావిస్తున్నాడట! ఇది ఎంత వరకూ నిజమో మనకు తెలియదు కాని… గతంలో కంటే విజయసాయి రెడ్డి హంగామా మాత్రం వైసీపీలో ఖచ్చితంగా పెరిగింది!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.