Publish Date:Sep 20, 2025
నేను అసెంబ్లీకి రాను. కావాలంటే మీరు వెళ్లండి. అవసరమైతే మీకు పెద్దిరెడ్డినిచ్చి పంపిస్తా! అంటూ తన ఎమ్మెల్యేలతో అన్నారు జగన్. అంతే కాదు మనమంతా కలసి.. ఆ 11 సీట్లకు కూడా రాజీనామా చేసేద్దాం.. నేనైతే ఎంపీగా పోటీ చేస్తా అంటూ ట్విస్ట్ ఇచ్చేసరికి పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి ఒక్కసారిగా అదిరిపడ్డారట. ఇదేందిదీ..... ఉరుము ఉరిమి మం*లం మీద పడ్డట్టు నా మీద పడ్డాడేంటని ఒక్కసారిగా కంగారు పడ్డారట భారతీరెడ్డి బావ అవినాష్ రెడ్డి.
అంతే కాదు.. హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ని చంపేసినట్టు.. నన్నిలా టార్గెట్ చేశారేంటని అవినాష్ లోలోన తెగ కుమిలిపోతున్నారట.
ఇదంతా ఇలా ఉంటే.. జగన్ గానీ, ఒక వేళ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. అవినాష్ చేత కడప ఎంపీగా రిజైన్ చేయించి.. ఆ ఎంపీ పోస్టుకు తాను పోటీ చేశారే అనుకుందాం. ఆబ్వియస్ గా అవినాష్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండొచ్చు.
ఓకే ఇన్నాళ్లు వైయస్ ఫ్యామిలీ నుంచి కాకుండా అదే ఫ్యామిలీ అయినా కాస్త దూరపు మనిషి ఒకరు ఈ సీటు నుంచి పోటీ చేశారే అనుకుందాం.. మొన్నటి జెడ్పీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో పులివెందులలో వైయస్ పులి.. గాండ్రిపునకు బదులు.. మియాం మియాం అని అరిస్తే పరిస్థితేంటి? అంతే కాదు.. ఇటు ఉన్నదీ బాయె అటు ఉం* కున్నదీ పాయె అన్నట్టుగా మారే సీన్ ఎదురవుతుంది. దీంతో జగన్ కండీషన్ అడకత్తెరలో పోకచెక్కగా మారుతుందని అంటారు విశ్లేషకులు.
ప్రెజంట్ జగన్ స్కెచ్ ఏంటంటే.. తానుగానీ ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడకు కేంద్ర బలగాలు దిగుతాయని.. జనంలోని వ్యతిరేకత కూడా బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
రిస్క్ తీస్కోవడం మంచిదే! కాదనడం లేదు. కానీ, నీటిలోని ముసలి.. అధికారంలో ఉన్న పార్టీ మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటాయి. పులివెందులలో మొన్న ఎలాంటి సీన్ జరిగిందో.. సేమ్ టూ సేమ్ సీన్.. వచ్చే ఉప ఎన్నికల్లోనూ జరిగితే.. జగన్ 2. 0 అనే ఆశల్లోంచి 2 ఎగిరిపోయి.. కేవలం జీరో మిగిలితే.. !!!ఊహించుకోడానికే భయమేస్తోంది జగనన్నా.. తగ్గు తగ్గు.. అన్నది వైసీపీ కేడర్ అలెర్ట్ గా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-39-206555.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది