Publish Date:Jul 18, 2025
ఏపీలో మాజీ సీఎం జగన్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తన తండ్రి మరణించినప్పటి నుంచీ ఆయన ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూ జనం నోళ్లలో నానుతూనే వస్తున్నారు. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు, ఇలా రకరకాలుగా హల్ చల్ చేస్తూనే వచ్చారు. అధికారంలోకి వచ్చాక అయ్యగారి అసలు స్వరూపం బయట పడింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన జ.. గన్ తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం నుంచి మొదలు పెడితే ఆర్ధిక పరిస్థితి చిందర వందర గందరగోళం చేయడం వరకూ ఆ రూటే సపరేటు.
క్విడ్ ప్రో కో అనే కొత్త విధానం ద్వారా ఏకంగా లక్ష కోట్ల అవినీతికి తెరలేపిన జగన్ తర్వాతి కాలంలో ఇవే కేసులతో జైలుకెళ్లి 16 నెలలు ఉన్నారు. బయటకొచ్చాక.. ఏపీ లో అనేకరకాల రాజకీయం చేసి.. అధికారం చేపట్టారు. ఆపై కొన్ని వందల కోట్ల రూపాయల మేర అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. భారీ ఎత్తున వెనకేసినట్టు చెబుతారు. శాండ్ వైన్ మైన్ అంటూ రంగమేదైనా రాబడి చూసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. ఆ మాటకొస్తే తాను అధికారులతో నిర్వహించే మీటింగులు కూడా ఓట్లా నోట్లా ఇవేవీ రాకుంటే నో అనేస్తారని టాకు. జగన్ ఒక్కడే కాదు ఆయనతో పాటు ఆయన మంత్రి వర్గంలో పని చేసిన వారు కూడా ఏదో ఒక రకంగా అవినీతిలో భాగమయ్యి తలా పాపం తిలాపిడికెడుగా బిహేవ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా కలసి వరుస పెట్టున జైళ్లకెళ్తున్న దృశ్యాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఇక్కడ తెలంగాణలో ఆ కొరత తీర్చడానికా? అన్నట్టు మరో జగన్ తయారయ్యాడు. అయితే ఆయన రాజకీయాల్లో లేరు కానీ వారికన్నా మించి అన్నట్టుగా చెలరేగిపోయినట్టు తెలుస్తోంది. కేవలం HCA అనే ఒక క్రికెట్ అసోసియేషన్ నుంచే ఆయన ఏకంగా 800 కోట్ల రూపాయల బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇటు SRH నుంచి అదనపు టికెట్లను ఆశించడం నుంచి మొదలు పెడితే.. టీవీల కొనుగోళ్ల వరకూ అంతా అవినీతి మయంగా తెలుస్తోంది.
ఆ మాటకొస్తే తనకున్న రాజకీయ పలుకుబడి అండదండలను అడ్డు పెట్టుకుని అదిపనిగా.. ఈ జగన్మోహనుడు HCAలోకి రాంగ్ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు.. పరి పరి విధాలా ఈ క్రికెట్ అసోసియేషన్ ని కంపు కంపు చేసినట్టు ఆరోపిస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ తెలంగాణ జగన్ కేవలం HCAలో ఉన్నందుకే ఇంత పెద్ద మొత్తంలో మేస్తే.. ఆయనే గనక రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే పరిస్థితేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలా పేరే అలాంటిది.. ఎటు నుంచి ఎటు చూసినా.. అవినీతిలో అందనంత ఎత్తుకు ఎదగాల్సిందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి సర్వత్రా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-39-202236.html
ఇప్పటి వరకూ కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత ఉందని అంతా భావించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె అధ్యక్షత వహిస్తోన్న తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీ చేస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి.
భారత్ అంటే భగ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా ఇండియాపై యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అసలైనా సరే రాబట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ వస్తు,సేవల పన్ను విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అడ్డాలోనే ఆ పార్టీని మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్.. మూడు నెలల ముందు స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇసుమంతైనా వెనుకాడటం లేదు.
వైసీపిలో తిరుగుబాటు జరగనుందా? మరీ ముఖ్యంగా ఇప్పడు వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు జగన్ ను ధిక్కరించనున్నారా? త్వరలో అంటే ఈ నెలలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చ జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధకారంలో ఉన్న సమయంలో సజ్జల పార్టీనీ, ప్రభుత్వాన్నీ గుప్పిట పట్టి ఓ ఆటాడుకుంటే.. ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల.. అదే నండి సజ్జల్ బార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా పెత్తనం చెలయించారు.
కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా సంచలనంగా మారి, పార్టీలో సంక్షోభానికి కారణమైన కేసీఆర్ తనయ కథ ముగిసినట్లేనా? అంటే కాదు అన్న సమాధానమే వస్తోంది. పరిశీలకులు బీఆర్ఎస్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు.
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఆయన చాలా గ్యాప్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అయితే ఈ నెలాఖరులోగా స్థానక ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో మారు హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం వైసీపీ పునాదులనే కదిపేలా ఉండటంతో ఆ పార్టీలో కంగారు మొదలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టై జైలు పాలైన తమ పార్టీ నేతలను కలవడానికి కూడా వైసీపీ అధినేత జగన్ ముందువెనుకలాడుతున్నారు.
బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోందా? 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం, ఆ తరువాత గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా సాధించిన జీరో రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకున్నట్లు కనిపించదు.
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీలో గందరగోళానికి దారి తీసింది. ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది.