మీరూ ఫొటోస్ తీస్తారు ఫిల్మ్ మేకర్స్ లా!

Publish Date:Aug 20, 2022

Advertisement

మనుషులు గడిచిపోయిన కాలాన్ని గుర్తుచేసుకోవడానికి చాలా రకాల మెరుగు ఉన్నాయి. గడిచిపోయినా కాలంలో చేదు జ్ఞాపకాలు అయితే మనసులో అలా ఉండిపోతాయి. కానీ తీపి జ్ఞాపకాలు చాలావరకు ఏదో ఒక ఉనికిని మనదగ్గర వదిలి ఉంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో బుడిబుడి నడకలు, ఇష్టమైన వారితో కలసి గడిపిన క్షణాలు, ఇష్టమైన ప్రదేశాలను సందర్శించిన రోజులు ఇలాంటివన్నీ చాలావరకు ఫోటోల రూపంలో మనదగ్గర ఉంటాయి. వాటిని ఎప్పుడైనా చేసుకున్న ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఆ క్షణాలను గడిపినట్టే ఉంటుంది. ఇంత తీపి గుర్తులు అయిన ఫోటోల వెనక చరిత్ర ఏంటి??  దాని పరిణామక్రమం ఏంటి అని చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 19 వ తేదీని ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కి బోలెడు అద్బుతాలు సృష్టిస్తున్న ఫోటో వెనుక అసలు సంగతి ఏముంది?? మొబైల్స్ లో కూడా చక్కగా ఫొటోస్ తీసేస్తున్న మనకు ఈ ఫోటో ఆవిష్కరణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం  సందర్భంగా వచ్చేసింది.

ఫోటోగ్రఫీ డే ని ఎలా నిర్ణయించారు??

1837లో లూయిస్-జాక్వెస్-మాండే డాగురే, డాగ్యురోటైప్ ను ఆవిష్కరించారు. ఇతను  ఫ్రెంచ్ కళాకారుడు మాత్రమే కాకుండా ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన ఆవిష్కరణ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు విక్రయించారు. తరువాత అది బహుమతిగా అందివ్వబడింది. ఆయన అవిష్కరణను 1839 ఆగస్ట్ 19 న గుర్తించారు. 

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 మంది కలసి 1991 నాటికి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న మీదట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం మొదలయ్యింది.

ఫోటో అనే ప్రక్రియకు బీజం వేసిన లూయిస్ డాగురే భౌతికాశాస్త్రవేత్త కూడా. ఆ తరువాత అతను ప్రసిద్ధ థియేటర్ డిజైనర్ అయ్యాడు. జోసెఫ్ నైసెఫోర్ నీప్స్ అనే వ్యక్తి డాగురే తో వ్యాపార భాగస్వామిగా ఉండేవాడు. ఇతను హీలియోగ్రాఫి పద్దతిలో ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ తెలిసినవాడు. నీప్సే "వ్యూ ఫ్రమ్ ది విండో ఎట్ లే గ్రాస్" అనే చిత్రాన్ని 1826లో పాలిష్ షీట్ మీద రికార్డ్ చేసాడు. ఇదే మొట్టమొదటి ఫోటో. 

నీప్సే మరణం తరువాత లూయిస్ డాగురే 1837లో తన సొంత పద్దతిలో డ్యాగురోటైప్ ను కనుగొన్నాడు. అది సిల్వర్ అయోడైడ్ తో రాగి ప్లేట్ పై రికార్డ్ చేయబడిన ఫోటో. కెమెరాలో రికార్డ్ చేయబడిన ఈ ఫొటోస్ పాదరసం ఆవిరికి గురిచేయడం వల్ల డవలప్ చేయబడ్డాయి. 1839 తరువాత గ్రేట్ బ్రిటన్ మినహా అన్నిచోట్లా పేటెంట్ దాఖలు చేశారు దీనికి. 

ఇవీ ఫోటోగ్రఫీ వెనక ఉన్న కొన్ని విషయాలు. అయితే ప్రస్తుతం అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్స్ లో ఉన్న లెన్స్ కెమెరాలు ఉపయోగిస్తే ఎంతో అద్భుతమైన ఫొటోస్ తీసేస్తున్నారు అందరూ. నిజం చెప్పాలంటే ఫొటోస్ తీయడం మీద కాస్త ఆసక్తి ఉంటే చాలు ఇప్పుడు చేతుల్లో ఉండే మొబైల్ సహాయంతో ప్రతిఒక్కరూ ఫోటోగ్రాఫర్స్ తీసినంత అందంగా ఫొటోస్ తీసేస్తున్నారు. 

అయితే ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్నా కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల  ఫొటోస్ ఔట్పుట్ సరిగా రాదు. అందుకే ఫొటోస్ తీసేటప్పుడు గమనించుకోవలసిన కొన్ని విషయాలు తెలుసుకోండి!!

ఉపయోగిస్తున్న పరికరం ఏదైనా అంటే మొబైల్ కానీ కెమెరా కానీ దాన్ని వాడటం ఎలా అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలి. 

ఏవిధమైన ఫొటోస్ తీయాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి.

కెమెరా సెట్టింగ్స్ ను సరిచేసుకోవాలి.

ఫొటోస్ తీసేటప్పుడు లైటింగ్ ను ఒడిసిపట్టడం నేర్చుకోవాలి. షేడ్ ప్రాంతాలను, దిశలను అవగాహన చేసుకుని ఫొటోస్ తీయాలి.

ఫొటోస్ తీసేటప్పుడు కెమెరా షేక్ అవ్వకుండా మీ పాదాలను కదల్చడం కూడా తెలిసిఉండాలి. లేకపోతే ఫొటోస్ బ్లర్ గా వస్తాయి.

ఫొటోస్ తీయడం  కోసం ఉపయోగించే ఇతర అదనపు సహాయపరికరాలు ఉంటాయి. అదే ట్రై పాడ్. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఎత్తు, మౌల్డ్ చేయడం వంటివి.

కెమెరాకు కు ఫ్లాష్ ను ఎలా ఎప్పుడు ఉపయోగిస్తే ఫొటోస్ బాగా వస్తాయి తెలుసుకోవాలి.

ఫొటోస్ ని ఎప్పుడూ బ్యాకప్ పెట్టుకోవాలి. అలా చేస్తే పోగొట్టుకున్నాం అనే బాధ ఉండదు.

ఫోటో కి ఫోటో కి మధ్య చేంజ్ ని గమనించాలి. ఎలాంటి ఫొటోస్ బాగా తీయగలుగుతున్నారు అనేది బాగా అర్థమైపోతుంది.

ఫోటో ఔట్పుట్ బాగా వచ్చేవరకు వెనక్కు తగ్గకండి. ఓపిక చాలా ముఖ్యం.

ఇవన్నీ తెలుసుకుని పాటిస్తే మీకు మించిన ఫోటోగ్రాఫర్ లేరని అందరూ ఒప్పేసుకుంటారు. మీరు తీసిన ఫొటోస్ ఎవరికైనా చూపించినప్పుడు.

                                     ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది...
ఆత్మవిశ్వాసం అనేది అన్ని వయసుల వారికి ఎంతో ముఖ్యం.  ఇది జీవితం మెరుగ్గా మలుచుకోవడంలో, ఏదైనా ఒక పనిని చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత సులువైన పని అయినా సరిగా చేయలేరు....
ప్రతి మనిషి రెండు రకాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలి.  ఒకటి శారీరక ఆరోగ్యమైతే.. రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక  ఆరోగ్యం గురించి చాలామంది ఆలోచన చేస్తారు.  మంచి శారీక ఆరోగ్యం కోసం చాలా రకాల టిప్స్ ఇంకా మంచి జీవనశైలి పాటించడానికి కూడా ప్రయత్నం...
అతి సర్వత్రా వర్జయేత్  అని అన్నారు పెద్దలు.  అంటే అతిగా ఏం చేసినా అది నష్టాన్నే కలిగిస్తుంది అని. అతిగా తినడం, తాగడం, ఏదైనా పని చేయడం,  నిద్రపోవడం.. ఇలా ఒకటని కాదు.. అతిగా ఏం చేసినా దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది...
ప్రపంచంలో ప్రతి మనిషి తన తన పాత్రలతో, బాధ్యతలతో జీవనం కొనసాగిస్తాడు. అందులో పురుషుల పాత్ర ప్రత్యేకం. కుటుంబం, సమాజం, వృత్తి ఈ మూడు రంగాలలోనూ పురుషులు  నిశ్శబ్దంగా, కనిపించని ఒత్తిడులను భరిస్తూ సాగుతుంటారు...
ఈ ప్రపంచంలో చాలా పవిత్రతను,  ప్రత్యేకతను కలిగి ఉండేది వైవాహిక బంధం.  ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వివాహంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండటం ఈ బంధానికి చాలా ప్రాధాన్యతను తెచ్చి పెడుతుంది.  సహజంగా పెళ్లి అంటే చాలా హడావిడి జరుగుతుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.