వృక్షాసన భంగిమ లో మానవ హారం.. గోష్పాద క్షేత్రంలో యోగాంధ్ర

Publish Date:Jun 14, 2025

Advertisement

కొవ్వూరు గోష్పాద క్షేత్రం విఐపి ఘాట్ లో "యోగాంధ్ర" రాష్ట్రస్థాయి కార్యక్రమం శనివారం (జూన్ 14) విజయవంతంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో   ప్రజా ప్రతినిధులు, వేద పాఠశాల విద్యార్థులు, వయో వృద్ధులు, మహిళలు, యువత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తో "ఆర్ట్ ఆఫ్ లివింగ్" సంస్థకు చెందిన యోగ గురువు సరోజ యోగాసనాలు వేయించారు. అనంతరం బ్రహ్మకుమారి సోదరి రాజయోగ ధ్యానం చేయించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. అందులో భాగంగానే కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.  మంచి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని సూచించారు. జూన్ 21 తేదీన మరింత మంది యోగా సాధన కార్యక్రమం లో పాల్గొనాలని  పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా యోగా వృక్షాసన భంగిమలో  మానవహారం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా పర్యాటక ప్రాధాన్యత దృష్ట్యా ఈ యోగా కార్యక్రమానికి గోష్పాద క్షేత్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందని వివరించారు.  

ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి ఖిల్లాపై 

ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా యోగాంధ్ర ను వినూత్నంగా నిర్వహిస్తున్నారు.  యోగాతో పాటు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా ప్రణాళికా బద్ధంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కృష్ణా జిల్లా రాష్ట్రంలోని జిల్లాల కంటే ముందుంటోంది.  ఇటీవల కృష్ణా నదిలో బోట్లపైన యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ జిల్లా   శనివారం (జూన్ 14) ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కొండపల్లి ఖిల్లాపై యోగాసనాలు ప్రదర్శించి అందరినీ ఆకర్షించింది.

కొండపల్లి ఖిల్లాపై   యోగాసనాల ప్రదర్శనే కాకుండా పర్యాటకంగా కొండపల్లి ఖిల్లాకు ప్రాచుర్యం కల్పించేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించింది.    యోగాపై అందరిలోనూ అవగాహన ఏర్పడేందుకు ఎంతగానో దోహదపడేలా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. 

By
en-us Political News

  
లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కండక్టర్‌లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌పై పోలీసులు దేశద్రోహం కేసునమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఈ ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతను కూటమి పార్టీలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు అప్పగించాయి.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బాట‌సింగారం వ‌ద్ద ఓ కారు ప్ర‌మాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఇక కారును ప‌రిశీలించ‌గా, అందులో గంజాయి ప్ర‌త్య‌క్ష‌మైంది.
దేశంలో ఓట్ చోరీ తీవ్ర దుమారం రేపుతున్న వేళ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గతం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మరో నాలుగైదు రోజుల్లో అంటే ఆగష్టు 21తో నామినేషన్ల గడువు, ముగుస్తుంది. అయినా.. అధికార విపక్ష కూటమి అభ్యర్ధులు ఎవరన్నది ఇంకా తేలలేదు. అధికార ఎన్డీయే కూటమిలో అభ్యర్ధి ఎవరన్నది మాత్రమే తేలవలసి వుంది.
యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండడమే కాకుండా... ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటూ ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచిస్తున్నారు.
అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు వైసీపీకి అలవాటే. దొరికిపోయిన ప్రతిసారీ నెటిజన్ల ట్రోలింగ్ కూడా ఆ పార్టీ నేతలకు కొత్తేం కాదు. అధికారంలో ఉన్నప్పటి నుంచీ కూడా వైసీపీ చేస్తున్నది ఇదే. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాలు, దుష్ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోతో చెలరేగిన తీరు సామాన్య జనానికి కూడా వెగటు పుట్టించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు బయలుదేరారు.
సృష్టి కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే..మరో అక్రమ సృష్టి బయటపడింది. మహిళలను అంగట్లో సరుకుల మార్చి అమ్మత నాన్ని అమ్ముకుంటున్నారు
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని పీఏసీఎస్‌ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో తెల్లవారు జామునుండే పెద్ద ఎత్తున బారులు తీరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.