రామనారాయణంలో వినూత్నంగా యోగాంధ్ర

Publish Date:May 30, 2025

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమం వినూత్నంగా నిలిచింది. పర్యాటక ప్రదేశం అయిన రామనారాయణం లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో  రామధనస్సు ఆకృతిలో పదిహేను వందలమంది యోగాసనాలు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. అక్కడివారితో కలసి యోగా చేశారు. 

 ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో యోగాంధ్ర కార్య‌క్రమాన్ని నిర్వ‌హించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క కేంద్రం రామ‌నారాయ‌ణంలో శుక్ర‌వారం (మే 30) జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన‌ రామ‌నారాయ‌ణుని పాదాల చెంత రామ‌ధ‌నుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి  కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ స‌హా సుమారు 1500 మంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది,  ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు యోగాస‌నాలు వేశారు. ఉద‌యం ఏడుగంటలకే   పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, యోగ ప‌ట్ల ఆస‌క్తి గ‌ల వారంతా తెల్ల‌ని దుస్తులు ధ‌రించి యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వ‌ర్యంలో యోగ గురువులు డాక్టర్ ఆరిశెట్టి ఇందుమ‌తి,  సుంద‌ర‌శివ‌రావులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ అంద‌రితో సుమారు 45 నిముషాల పాటు ప‌లు యోగ‌సనాలు వేయించారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం యోగా ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే ఉద్దేశ్యంతో ఈ నెల‌ను యోగా మాసంగా ప్ర‌క‌టించి అన్ని ప్రాంతాల్లో యోగ శిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేసి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. యోగా మ‌న పూర్వీకులు మ‌నకు అందించిన గొప్ప ఆస్తి అన్నారు. దీనిని సాధ‌న చేయ‌డం ద్వారా   ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌చ్చనీ, ఈ దిశగా  ప్ర‌తి ఒక్క‌రినీ ప్రోత్స‌హించ‌డం యోగాంధ్ర ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. జూన్ 21న అంత‌ర్జాతీయ దినోత్స‌వంలో పాల్గొనేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి విశాఖ వ‌స్తున్నార‌ని ఆరోజున రాష్ట్రమంత‌టా ప్ర‌తి గ్రామంలో యీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌పంచానికి యోగా విశిష్ట‌త‌ను తెలియ‌జేసే ఉద్దేశ్యంతో  ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు నెల‌రోజుల యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలోని నాలుగు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని మొద‌ట‌గా రామ‌నారాయ‌ణంలో   ఏర్పాటు చేశామ‌న్నారు. జూన్ నెల‌లో చింత‌ప‌ల్లి బీచ్, రామ‌తీర్ధం, తాటిపూడి రిజ‌ర్వాయ‌రు త‌దిత‌ర ప్ర‌దేశాల్లోనూ యోగాంధ్ర‌లో భాగంగా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

జూన్ 10వ తేదీన జిల్లాకు చెందిన 5 వేల మంది ఉపాధి ప‌థ‌కం వేత‌న‌దారుల‌తో యోగాస‌నాలు ప్ర‌ద‌ర్శించే కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం జీవితంలో యోగ‌ను భాగంగా చేసుకోవాల‌న్నారు. యోగాస‌నాల ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంద‌రికీ రామ‌నారాయ‌ణ ద‌ర్శ‌నాన్ని క‌ల్పించ‌డంతోపాటు తీర్ధ ప్ర‌సాదాల‌ను ఎన్‌.సి.ఎస్‌.ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో అంద‌జేశారు.

By
en-us Political News

  
చాలా మంది జ‌గ‌న్ అనేవాడు. చాలా చాలా బాధ ప‌డుతున్నాడు. నీర‌సించి పోయాడు..అస్స‌లు డ‌బ్బులు లేవంట‌ క‌నీసం ఆఫీసు రెంటు కూడా క‌ట్ట‌లేక పోతున్నాడంట‌..అని తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌తో అల‌మ‌టించిపోతున్నారుగానీ.. జ‌గ‌న్ ప‌రిస్థితి అలాగేం లేదు.
ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది.
ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు.
ఎట్ట‌కేల‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచార‌ణ చేయ‌డానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే గ‌త 14 నెల‌లుగా అమెరికాలో ఉన్న ప్ర‌భాక‌ర్ రావు వ్య‌వ‌హారం, ఎన్నో మ‌లుపుల మీద మ‌లుపులు తిరిగి, ఆయ‌న ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ వ‌చ్చే వ‌ర‌కూ సాగింది.
ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3) సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ తన సినిమా థగ్ లైఫ్ జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టిన ఏపీ ప్రభుత్వం హైరేంజ్‌లో ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 40వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఉద్రిక్త‌త నెల‌కొంది. గత వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన వ్యక్తిని పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతిస్తున్నారని ద‌ళిత‌, ప్ర‌జా సంఘాలు నిర‌స‌న తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో హీరో నాగార్జున భేటీ అయ్యారు. ఈ ఇరువురి భేటీ ఇరు రాష్ట్రాలలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడిని హీరో నాగార్జున మంగళవారం (జూన్ 3) కలిశారు.
రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మ‌ధ్య తన  కూతురు చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి ఇలా మారిపోయారా? అంటే అవున‌నే తెలుస్తోంది.  మొన్న రాబిన్ హుడ్ సినిమా ఫంక్ష‌న్లో డేవిడ్ వార్న‌ర్ ని దొ*గ ము*కొడుకు అంటూ కామెంట్ చేసి ట్రోల్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.