కోట్ల ఖర్చుతో యోగా..ఏపీకి మైలేజ్ వస్తుందా?

Publish Date:Jun 23, 2025

Advertisement

 

నిజానికి చంద్ర‌బాబుది బాహుబ‌లి ఐడియా. ఆయ‌న రాయి రాయి కొట్టుకుంటూ పోరు. ఒక్క దెబ్బ‌తో కొడితే కొండ ఎలా పిండి అవుతుందో చేసి చూస్తారు. ఈ విష‌యంలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన కృషి చాలానే ఉంది. మీరు కావాలంటే చూడండి ఆయ‌న సీఎం అయిన తొలి నాళ్ల‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని వెంట‌ప‌డి మ‌రీ  ఒకే ఒక్క ప్ర‌జంటేష‌న్ ఇచ్చి.. ఏకంగా ఆ కంపెనీ ఆఫీసు హైద‌రాబాద్ వ‌చ్చేలా చేశారు. త‌ర్వాతి కాలంలో హైద‌రాబాద్ కి ఎన్నో సాఫ్ట్ వేర్ కంపెనీలు రావ‌డం మాత్ర‌మే కాదు.. ఇక్క‌డే స‌త్యం వంటి అతి పెద్ద కంపెనీగా ఎదగ‌డం మ‌న‌కు తెలిసిందే.

అయితే ఇదే స‌త్యం కంపెనీని వైయ‌స్ హ‌యాంలో చావు దెబ్బ తీసి  ఎద‌గ‌నీకుండా  చేశారు. అదే మీకు క‌ర్ణాట‌క‌లో బెంగ‌ళూరు బేస్ చేసుకుని.. ఏర్ప‌డ్డ ఇన్ఫోసిస్ ఇంకా ప‌దిలంగా  ఉంది. కార‌ణం అక్క‌డ ఇలాంటి దెబ్బ కొట్టుడు వ్య‌వ‌హారం లేక పోవ‌డమే. త‌ర్వాత హైద‌రాబాద్ బెంగ‌ళూరుతో స‌మానంగా సాఫ్ట్ వేర్ హ‌బ్ గా ఎదిగిన  విధం ప్ర‌పంచ‌మంతా చూసింది. ప్ర‌స్తుతానికి వ‌స్తే ఇదే ఏపీని మైక్రోసాఫ్ట్ ఫౌండేష‌న్ సాయంతో.. ఒక ఏఐ హబ్ గా త‌యారు చేసే విధంగా.. ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ్. దావోస్ కి వెళ్లి అక్క‌డేమీ సాధించలేక పోయార‌ని కామెంట్ చేశార‌ప్ప‌ట్లో ఇదే వైసీపీ నేత‌లు. త‌ర్వాత దాని రిజ‌ల్ట్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కార‌ణం దావోస్ లో గేట్స్ ఫౌండేష‌న్ తో జ‌రిగిన  చ‌ర్చ‌ల‌కు సంబంధించిన అంశాలే నేడు ప్ర‌తిఫ‌లిస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపీ  డ్రోన్ హ‌బ్ గా ఎదుగుతోంది. నెక్స్ట్ స్టెప్ ఏఐ హ‌బ్ గానూ ఎద‌గ‌డ‌మే టార్గెట్ గా  పెట్టుకుంది  కూట‌మి ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే వాట్స‌ప్ గ‌వ‌ర్నెన్స్ వ‌చ్చేసింది. ఇదొక ముంద‌డుగు.

ఇక పోతే పీ- 4 ద్వారా జ‌రిగే విచిత్రాల‌ను వ‌చ్చే రోజుల్లో ఈ ప్ర‌పంచం చూడ‌బోతుంది. ఇదొక ఇంట‌ర్నేష‌న‌ల్ థియ‌రీ. కావాలంటే మీరు చూడండి సంప‌న్న దేశాలు, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఈ విధానాలు ఫాలో అవుతుంటారు. మ‌నం బాగా అబ్జ‌ర్వ్ చేసిన‌ట్ట‌యితే ఈ విషయం  క్లియ‌ర్ క‌ట్ గా  తెలుస్తుంది. అక్క‌డ ఆహారం విచ్చ‌ల‌విడిగా ప‌డేస్తామంటే ఒప్పుకోరు. కార‌ణ‌మేంటో తెలుసా? అది ఎంద‌రో క‌ష్ట‌ప‌డి  త‌యారు చేసింది. కాబ‌ట్టి ఫుడ్ వేస్టే  చేయ‌డం అంటే పండించిన‌ వారిని అగౌర‌వ ప‌ర‌చ‌డ‌మే అవుతుంద‌ని వారిస్తారు. స‌రిగ్గా అలాగే ఒక వ్య‌క్తి ఎదుగుద‌ల‌లో తెలిసీ తెలీకుండా ఒక స‌మాజం స‌హాయ‌తా గుణం  దాగి ఉంటుంది. వారు అనుకున్న విధంగా ఎదిగాక‌.. ఆ స‌మాజానికి తిరిగి ఇవ్వ‌డం అన్న‌దొక‌ రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తే త‌ద్వారా వారు ఆ రూట్ ఫాలో అయ్యి.. ప‌ది మందికి సాయం చేస్తారు. వీరిలో కొంద‌రు ప్ర‌భుత్వ గుర్తింపు కోస‌మైనా, స‌మాజంలో గౌర‌వం కోస‌మైనా.. క‌ష్టంలో ఉన్న వారికి హెల్ చేయాల‌న్న భావ‌న‌కు వ‌స్తారు. దీన్నే బాబు ఇంప్రూవ్ చేశారు. ఆ దిశ‌గా వ‌చ్చే రోజుల్లో మ‌రింత ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇప్పుడు ప్ర‌జంట్ సిట్యువేష‌న్లోకి వ‌స్తాం. ఈ యోగాంధ్ర ఈవెంట్ ఎందుకు? ఎవ‌రి  కోసం చేశారు? 
లాస్ట్ కి అక్క‌డేం జ‌రుగుతోంది? దాని  ద్వారా ల‌భించిందేంటి? జ‌నం త‌మ‌కిచ్చిన మేట్స్ లాక్కుని పీక్కుని వెళ్ల‌డం త‌ప్ప‌.. అన్న ద‌గ్గ‌ర ఈ ఫ్యాను బుర్ర‌లు ఆగిపోతున్నాయి.కానీ, బాబు బేసిక్ థియ‌రీ  అది కాదు. అస‌లాయ‌న విచ్చ‌ల విడి ఖ‌ర్చు ఎప్పుడూ పెట్ట‌రు. అదంతా కూడా ఒక‌ పెట్టుబ‌డే. ఇలా చేయ‌డం వ‌ల్ల త్రూ మోడీ ద్వారా అది నేష‌న‌ల్ న్యూస్ అవుతుంది. అంతే  కాకుండా ప్ర‌పంచం మొత్తం జూన్ 21ని ఇంట‌ర్నేష‌న‌ల్ గా యోగాడేగా ఫాలో అవుతుండ‌టం వ‌ల్ల‌.. అది ఇంట‌ర్నేష‌న‌ల్ న్యూస్ గానూ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో ప్ర‌పంచ మార్కెట్ని  ఏపీ నిర్వ‌హ‌ణా సామ‌ర్ధ్యంతో విశేషంగా ఆక‌ర్షించ‌వ‌చ్చు. మ‌న ఎగ్జిక్యూష‌న్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది.

ఇక్క‌డ మ‌రో రెండు ముఖ్య మైన విష‌యాలు సైతం గుర్తించాలి. మొద‌ట మోడీ ఏపీకి ఎంతో చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ ఉక్కుకు ప్యాకేజీనివ్వ‌డం, రైల్వే జోన్ కి గ్రీన్ సిగ్న‌ల్, ఇంకా పోల‌వ‌రం నిధులు ఇలా కేంద్రం నుంచి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వ‌స్తున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోనూ పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందుతున్నాయి. దీనంత‌టికీ కార‌ణం ప్ర‌ధాని మోడీ. ఆయ‌న మ‌న‌కంటూ ఇంత చేస్తుంటే.. ఆయ‌న‌కు ఇష్ట‌మైన‌వి చేయ‌డంలో త‌ప్పు ఏంట‌న్న‌ది ఒక వాద‌న‌.అయితే ఇందులో రెండో యాంగిల్ ఏంటంటే.. మీరు కావాలంటే చూడండి.. మొన్న యూఎస్ లో ట్రంప్ ఆర్డ‌ర్ ఒక‌టి తెచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం అక్క‌డ ఔష‌ధ ధ‌ర‌లు త‌గ్గించ‌డం. అయితే, ఇక్క‌డే రెండు భిన్న మైన వాద‌న‌లు వినిపించాయి. అదేంటంటే.. అత్య‌ధిక ధ‌ర‌లు ఔష‌ధాల‌కు వెచ్చిస్తే మంచి వైద్యం అందుతుంది. ఇది బేసిగ్గా అమెరిక‌న్లు న‌మ్మే థియ‌రీ. అయితే ఇక్క‌డ మ‌రో గొప్ప వాద‌న ఏంటంటే.. అస‌లు మందుల‌తో అవ‌స‌రం లేకుండా యోగా, వ్యాయామం త‌దిత‌రాలు ప్ర‌జ‌లు విరివిగా  అల‌వాటు చేసుకుంటే.. ఔషదాల‌ను వాడ‌కుండా చేయొచ్చ‌న్న‌ది ఒక ఆలోచ‌న  వెలుగు చూసింది. దీన్నిబ‌ట్టీ చూస్తే జ‌నారోగ్యం కాపాడ్డంలో భాగంగా ఇదొక బెస్ట్ మెథ‌డ్. ఇవేవీ  గుర్తించ‌కుండా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు క‌రెక్టేనా? అన్న‌దొక ప్ర‌శ్న‌. 

మొన్న దావోస్ వెళ్లిన‌పుడు మిస్ అయ్యింది ఈ ఎగ్జిబిట‌రీ థియ‌రీనే. హైద‌రాబాద్ బీభ‌త్స‌మైన స్టాల్ పెట్టి ఎగ్జిబిట్ చేసింది. మ‌న ద‌గ్గ‌ర అందుకు స్కోప్ లేకుండా పోయింది. ఇలాంటి స్కోప్ లేన‌పుడు క‌ల్పించాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌. దీంతో వ‌చ్చే యోగాడేని దృష్టిలో పెట్టుకుని గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రాం ప్లాన్  చేద్దామ‌నుకున్నారు. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగానే చేశారు. మొత్తం మీద ప్రాగ్రామ్ ని భారీ ఎత్తున‌ స‌క్సెస్ చేశారు.ఈ డ‌బ్బు ఒక ప‌థ‌కానికి ఇవ్వొచ్చు. కాద‌న‌డం లేదు. అలాగ‌ని ఏ ప‌థ‌కాల‌కూ డ‌బ్బు ఆప‌డం లేదుగా.. మొన్నంటే మొన్న భారీ ఎత్తున అమ్మ‌కు వంద‌నం డ‌బ్బులు ప‌డి.. ఇంటిల్ల పాది ఎంత మంది పిల్ల‌లున్నారో..  వాళ్లంద‌రికీ డ‌బ్బులు ప‌డ్డ ప‌రిస్థితులున్నాయి. ఒకే ఇంట్లో ల‌క్షా యాభై ఆరు వేల రూపాయ‌ల మేర అమ్మ‌కు వంద‌నం డ‌బ్బులు ప‌డిన వార్త‌లు సైతం వెలుగు చూశాయి. ఇపుడీ యోగాంధ్ర వంటివి బ్రాండ్ ఏపీని మ‌రింత‌గా  ప్ర‌మోట్ చేస్తాయి.. త‌ద్వారా మ‌న ఉనికిని, నిర్వ‌హ‌ణా సామ‌ర్ధ్యాన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. అదే వ‌చ్చే రోజుల్లో ప్రాజెక్టులు మ‌న వైపు వ‌చ్చేలా చేస్తాయి. ఇందులో దాగిన మార్కెట్ మంత్ర ఇదీ. ఈ విష‌యం తెలీక కొంద‌రు.. దీన్ని కూడా ఒక బ్యాడ్ ప్రాప‌గాండ‌గా మార్చ‌డం ఆంధ్రులు చేసుకున్న దుర‌దృష్టంగా భావిస్తున్నారు కొంద‌రు విశ్లేష‌కులు.

By
en-us Political News

  
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.