అమరావతిపై వైసీపీ అక్కసు.. కొమ్మినేని అరెస్టు అన్యాయమంట

Publish Date:Jun 11, 2025

Advertisement

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో  రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. 

అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానిం చారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన చానెల్ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేశారు.  అమరావతి దేవతల రాజధాని కాదని.. వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆ అసభ్య వ్యాఖ్యలను నిలువరించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చ కొనసాగించడం వివాదాస్పదమైంది.

విజయవాడ అయోధ్యనగర్‌ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణం రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్‌లో అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటా పోటీగా మాటల యుద్ధానికి దిగారు. మరోవైపు దీనిపై అమరావతి మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. వైసీపీ నేతల తీరుపై భగ్గుమం టున్నారు. వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన వారిపై తగు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అరెస్ట్ తర్వాత కొమ్మినేనిని తుళ్లూరు  పోలీసుస్టేషన్‌ను తరలిస్తే.. అక్కడి ప్రజల ఆగ్రహావేశాలతో సమస్యలు తలెత్తుతాయని పోలీసులు ఆయనకు వైద్య పరీక్షల అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేష‌న్‌కు తరలించి.. మంగళగిరి కోర్టులో మాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వైసీపీ మీడియాలో కొమ్మినేని, కృష్ణంరాజుల చర్చపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ .. మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్ భారతీరెడ్డి  అమరావతి ప్రాంత మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే క్షమాపణలు చెప్పడం కాదు కదా.. కొమ్మినేని అరెస్ట్‌ను జగన్ తప్పు పడుతున్నారు. కొమ్మినేని అరెస్టు కక్షసాధింపేనని, డిబేట్‌లో వ్యక్తులు మాట్లాడే మాటలకు.. యాంకర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. మీడియాపై కావాలనే దాడులు చేస్తున్నారన్నారు. కొమ్మినేనిని చంద్రబాబు గతంలోనూ టార్గెట్‌ చేశారని ఎక్స్‌ వేదికగా విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత అన్నింటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో జగన్ వార్నింగులు ఇస్తున్నారు

కొమ్మినేని అరెస్టును తప్పుపట్టిన జగన్ ఆ చర్చలో కృష్ణంరాజు మాట్లాడింది తప్పేనని పరోక్షంగా అంగీకరించినట్లైంది. ముందు నుంచి అమరావతి రాజధానిపై వ్యతిరేకతతో ఉన్న జగన్ ఇంత జరుగుతున్నా ఇంకా అదే తరహాలో మాట్లాడుతుండటం విమర్శల పాలవుతోంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు ఏళ్లతరబడి ఆందోళనలు నిర్వహించారు.  అప్పట్లో వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

తాజా వివాదంపై రాజధాని ప్రాంత రైతులు, స్థానిక మహిళలు భగ్గుమన్నారు. కొమ్మినేని, కృష్ణంరాజుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. వాళ్లిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి వైసీపీ నేతలు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. నిరసన తెలుపుతున్న అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మహిళల్ని పిశాచాలుగా అభివర్ణించారు. రాక్షసులు కూడా అలా చేయరని.. అదో ఆర్గనైజ్‌డ్‌ తెగ అని సజ్జల వ్యాఖ్యానించడంపై మహిళలు మరింత రగిలిపోతున్నారు

మరోవైపు సాటి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన మాజీ మంత్రి రోజా కూడా కొమ్మినేనికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. క‌ృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమ్మినేని ఖండిచారంట. ఎవరో చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని అరెస్ట్ చేశారంట. మరి  ఖండిస్తే ఆ డిబేట్ అంతసేపు ఎలా కొనసాగిందో మాజీ మంత్రి రోజాకి తెలియదా అని దుమ్మెత్తి పోస్తున్నారు.

కొమ్మినేని లైవ్ షోలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తప్పే అని అంగీకరిస్తున్న వైసీపీ.. ఆ డిబేట్ కొనసా గించిన కొమ్మినేనిని మాత్రం సమర్ధిస్తుండటం లాజిక్ లేకుండా తయారైదంటున్నారు. మీడియా వ్యక్తి అయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తిరిగి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అమరావతిపై ఆ పార్టీ స్టాండ్‌ ఏంటో? రాజధానిపై వైసీపీ నేతలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

By
en-us Political News

  
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
Publish Date:Jul 3, 2025
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.