సునితారెడ్డి సవాల్.. వణికిపోతున్న వైసీపీ?

Publish Date:Apr 3, 2024

Advertisement

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య‌ను వాడుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం  తెలిసిందే. వివేకా హ‌త్య‌ను చంద్ర‌బాబు, తెలుగుదేశం నేత‌ల‌పై నెట్ట‌డంలో జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విజ‌యం సాధించారు. అయితే, వివేకా హ‌త్య‌కు కార‌ణం తెలుగుదేశం నేత‌లు కాద‌ని తేలిపోయింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హ‌త్య‌లో ప్ర‌ధాన ముద్దాయి అని విచార‌ణ‌ సంస్థ‌లు తేల్చేశాయి. అయినా  అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అధికారాన్ని ఉప‌యోగిస్తూ అండ‌గా నిలిస్తున్నారని జ‌గ‌న్ చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు సూటిగానే ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య కేసులో నిందితుల‌కు శిక్ష ప‌డాల‌ని సునీతారెడ్డి కోర్టుల్లో పోరాటం చేస్తున్న విష‌యం తెలిసింది. అయినా, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అవినాశ్ రెడ్డికి క‌డ‌ప‌ ఎంపీ టికెట్ ఇవ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ నిర్ణ‌యంతో మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్న సునీతారెడ్డి, వైఎస్ ష‌ర్మిలలు ఈ వ్య‌వ‌హారంపై నేరుగా ప్ర‌జ‌ల్లో తేల్చుకునేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు  పోటీ చేస్తుండ‌గా.. వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు ఎక్క‌డైనా సిద్ధ‌మ‌ని, సాక్షి ఛానెల్‌లోనూ చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని సునీతారెడ్డి సవాల్ చేశారు.

 గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య వ్య‌వ‌హారం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం పీఠాన్ని అదిరోహించ‌డంలో కీల‌క భూమిక పోషించింది. ప్ర‌స్తుత‌ ఎన్నిక‌ల్లో అదే వివేకా హ‌త్య ఘ‌ట‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌ధాన ఆయుధంగా మార‌బోతుంది. ప్ర‌తిప‌క్షాల‌కు తోడు.. చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ప్ర‌జా క్షేత్రంలో జ‌గ‌న్ అరాచ‌కాలను నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీకి ఎవ‌రూ ఓట్లు వేయొద్ద‌ని, హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించొదంటూ సునితారెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌జ‌ల‌ను కోరారు. తాజాగా, ఆమె మ‌రో అడుగు ముందుకేసి వివేకా హ‌త్య ఘ‌ట‌నపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని, అవ‌స‌ర‌మైతే సాక్షి ఛాన‌ల్ లోనూ తాను చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్చ‌కు రావాల‌ని   ఛాలెంజ్ చేశారు. సునీతా ఛాలెంజ్‌తో వైసీపీ శ్రేణులు వణికిపోతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి సవాల్ లో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన‌ట్లుగా అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అంటూ ష‌ర్మిల‌, సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అడ్డుకుంటున్నాడ‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న తండ్రిని హ‌త్య‌చేసిన హంత‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతూ సునీతారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌, ఆయన పార్టీ నేతలూ వివేకా హంత‌కులు సునీతారెడ్డి, ఆమె భ‌ర్త అని, వివేకా అక్ర‌మ సంబంధ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మంటూ ప్ర‌చారం చేశారు. ప్ర‌తీరోజూ సునీతారెడ్డిపై బుర‌ద జ‌ల్ల‌ట‌మే ప‌నిగా వైసీపీ వ్యవహరించింది.   ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి ఛాలెంజ్‌ను జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్వీక‌రించ‌కుంటే ఇన్నాళ్లూ తాము  సునీతారెడ్డి, ష‌ర్మిల‌పై చేసిన విమ‌ర్శ‌లు త‌ప్పుడు విమ‌ర్శ‌ల‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకొనే ప్ర‌మాదం ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు‌. జ‌గ‌న్ స్థానంలో ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తీరెడ్డి రంగంలోకిదిగి సునీతారెడ్డితో చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని, అలా చేయ‌కుంటే మ‌రికొద్దిరోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కుప్ప‌కూలడం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లిన స‌మ‌యంలో పార్టీ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న చెల్లెలు ష‌ర్మిల భుజానికెత్తుకున్నారు. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి జ‌గ‌న్ జైలు నుంచి మ‌ళ్లీ తిరిగొచ్చే వ‌ర‌కు వైసీపీ బ‌లోపేతానికి ఆమె కృషి చేశారు. అలాంటి చెల్లెలు సైతం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పూర్తిగా మారిపోయారని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌కు విరుద్దంగా వైసీపీ పాల‌న ఉందంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో ముద్దాయి అవినాశ్ రెడ్డి అని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మ‌ళ్లీ క‌డ‌ప ఎంపీ సీటును అవినాశ్ రెడ్డికి ఇవ్వ‌డంపై ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ‌కీయంగానే ఎదుర్కొనేందుకు వారు సిద్ధ‌మ‌య్యారు. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల్లో అవినాశ్ రెడ్డిని ఓడించ‌డం ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి షాకిచ్చేందుకు ష‌ర్మిల సిద్ధ‌వ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఒక‌వైపు వివేకా హ‌త్య‌కేసు, క‌డ‌ప‌లో వైఎస్ ష‌ర్మిల పోటీ, మ‌రోవైపు జ‌గ‌న్ తో వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మంటూ సునీతారెడ్డి సవాల్ ఇలా అన్ని అంశాలు ఏపీ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తుండ‌గా.. వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యాన్ని పెంచుతున్నాయి.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.