తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ పంచాయతీలు.. పెదరాయుడి పాత్రలో జగన్

Publish Date:Jun 21, 2022

Advertisement

 ముఖ్యమంత్రి  జగన్ క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ఫ్యాలెస్‌ ఇప్పుడు పంచాయతీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతే.. ఆ పంచాయతీలు విని తీర్పులు ఇచ్చే పెదరాయుడి పాత్రలో జగన్ జీవిస్తున్నారట. నిన్న మొన్నటి వరకు జగన్ మలి కేబినెట్ కూర్పులో భాగంగా.. పదవి పోయిన మాజీలను, పదవి రానీ అసమ్మతీయులను బుజ్జగించి దారికి తెచ్చుకునే పనిలో బిజీబిజీగా గడిపిన జగన్ ఇప్పుడు కొంచం ఊపిరి పీల్చుకుందామనుకునే సరికి  కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి.

ఒకటా రెండా.. మొత్తం 13 జిల్లాలు.. లోక్ సభ స్థానాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందీ జగన్ ప్రభుత్వం.  దీంతోనే అసలు సమస్య రాజుకొందని పార్టీ నేతలు అంటున్నారు.   అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు.. ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో పార్టీ అధినేత  జగన్ సతమతమౌతున్నారని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. జిల్లాల మార్పుతో అనవసర తలనొప్పులు  తెచ్చుకున్నట్లైందని మధన పడుతున్నారుని అంటున్నారు.  బీసీ సామాజిక న్యాయ భేరి పేరిట 17 మంది మంత్రులతో కూడిన బస్సు యాత్ర ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. కానీ ఈ యాత్ర తుస్సుమంది. అలాగే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా నిరసన సెగ తీవ్రంగా తగిలింది.

దీంతో రాష్ట్రంలో పార్టీ రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయా అన్న అనుమానం వైసీపీ అధినేతలోనే మొదలైందంటున్నారు. దీంతో పార్టీలో ఎక్కడ అసంతృప్తి ఉందని పించినా  అక్కడి వర్గాలను తాడేపల్లికి పిలిపించి బుజ్జగించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.   ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వర రెడ్డి తనయుడికి.. ఆయన సోదరుడి కుమారుడికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని సమాచారం. దీంతో వారిని తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని పంచాయతీ పెట్టి తీర్పిచ్చేశారు జగన్. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ పని అయిపోవడం, ఇదే జిల్లాలోని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  తెలుగుదేశంపైపు చూపు సారించడం, ఆమె  కుమార్తె కైవల్యా రెడ్డి భర్తతో కలిసి ఒంగోలు వేదికగా ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిసి.. మంతనాలు జరపడంతో జిల్లాలో  ఇతర పార్టీ ప్రముఖులను తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడిన జగన్, ప్రసన్న కుమార్ రెడ్డిని సైతం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతుండటంతో ఆయనను సైతం తాడేపల్లి పిలిపించి మాట్లాడే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా  మంత్రి విడదల రజనీ వర్సెస్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వర్గాలు ఒకరిపై ఒకరు కారాలూ, మిరియాలూ నూరుకుంటున్న పరిస్థితి. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరిల మధ్య పంచాయతీ తెలిసిందే. అలాగే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పంచాయతీని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ నిర్వహించాల్సిన పరిస్థితి.  పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్.. బుల్లితెర సీరియల్‌లాగా ఎప్పుటి నుంచో కొన.. సాగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అసమ్మతి గళం విప్పడంతో ఆయనపై ఫ్యాన్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకంతో పార్టీ పరువు  గోదారిలో కలిసిందనే టాక్  ఉండనే ఉంది.  విశాఖ జిల్లాలో టీడీపీ జెండాపై గెలిచి... వైసీపీలోకి దూకిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాం రాం చెప్పి.. సైలెంట్ అయ్యారు. ఆయన కూడా కుదిరితే సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభకు పంపుతానంటూ ముందే ఉరించి... ఆ తర్వాత ఆవిడను సైతం ఉసురుమనిపించారట. ఇప్పుడీ పంచయతీలన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి. పెదరాయుడు స్టైల్ లో తీర్పు చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే బాధ్యత  జగన్ దేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

వీటన్నిటికీ మించి  ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీకి మంచి బలం, బలగం కూడా ఉంది. కానీ ఆ  జిల్లాలో వైసీపీ క్యాడర్   గంపగుత్తగా  తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. అదొ పంచయతీ జగన్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.  ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో  వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు  పంచాయతీ కూడా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరనుంది.  

By
en-us Political News

  
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.