జగన్ ను నమ్మారు.. జైలు పాలౌతున్నారు!

Publish Date:Nov 14, 2024

Advertisement

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ నేత‌లు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌ల‌తోపాటు.. ఆ పార్టీల నేత‌ల‌పై, వారి కుటుంబ స‌భ్యుల‌పైనా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ పోస్టులు చేశారు. ఇళ్లల్లోని ఆడ‌వారిపైనా నీచాతినీచ‌మైన ప‌ద‌జాలంతో పోస్టులు పెట్ట‌డ‌మే కాకుండా.. ఫొటోల‌ను సైతం మార్ఫింగ్ చేసి మాన‌సికంగా ఇబ్బందికి గురిచేశారు. ఐదేళ్లు వైసీపీ సోష‌ల్ మీడియా  బ్యాచ్ ఆగ‌డాల‌కు అనేక మంది  ఇబ్బందులు పడ్డారు. క‌న్నీళ్లు  పెట్టుకున్నారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలాంటివారికి హెచ్చ‌రిక‌లు చేసి, వారిని పార్టీ నుంచి పంపేయాల్పసింది పోయి వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతూ ప్రోత్స‌హించారు. దీంతో ఐదేళ్ల పాటు వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు చేసిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌, ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పోస్టులు చేసిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై కేసులు పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఒక్కొక్క‌రికి నోటీసులు ఇస్తూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక‌ మంది గ‌తంలో వారు చేసిన తప్పుల‌ను ఒప్పుకుంటూ క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నారు. 

ఐదేళ్లు అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో చెల‌రేగిపోయిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌కు ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ  చ‌ర్య‌ల‌తో వ‌ణుకు పుడుతోంది. ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో   వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి కూడా ఉన్నాడు. వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి విచారించగా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆర్గ‌నైజ్డ్ గా నేర‌పూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెల‌కొల్పారు. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిళ‌, వైఎస్ విజ‌య‌మ్మ‌, వైఎస్ సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ‌లో చెప్పారు. తాడేప‌ల్లిలోని వైసీపీ సోష‌ల్ మీడియా కార్యాల‌యం నుంచి సోష‌ల్ మీడియా ఇంచార్జి స‌జ్జ‌ల భార్గ‌వ్ సూచ‌న‌ల మేర‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌పైనా అస‌భ్య‌క‌ర రీతిలో పోస్టులు పెట్ట‌డం జ‌రిగింద‌ని, అంతా స‌జ్జ‌ల భార్గ‌వ్ క‌నుస‌న్న‌ల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ న‌డుచుకుంద‌ని వ‌ర్రా పోలీసుల విచార‌ణ‌లో పేర్కొన్న‌ట్లు తెలిసింది. అయితే, అప్ప‌టికే  సజ్జల భార్గ‌వ్ తోపాటు ఎంపీ అవినాశ్‌ పీఏపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. వీరు ప‌రారీలో ఉండ‌టంతో వారికోసం వెతుకుతున్నారు. మ‌రోవైపు శ్రీ‌రెడ్డి, రాంగోపాల్ వ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళితో పాటు ప‌లువురిపైనా ఏపీలోని   స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే పోలీసులు విచార‌ణ‌కు రావాల‌ని వారికి నోటీసులు ఇచ్చారు. వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ వ‌ణికిపోతున్నది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్మి ఇదంతా చేశామ‌ని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని వాపోతున్నారు. 
 
వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతుండ‌టంతో  సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల  కేసులకు వ్యతిరేకంగా పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య  పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా  పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

కోర్టు తీర్పుతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కి గట్టి  ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ల‌యింది. అయితే, చాలా మంది ఒక‌వేళ కేసులు న‌మోదై జైలుకెళ్లినా వెంట‌నే బెయిల్ పై బ‌య‌ట‌కు రావొచ్చ‌న్న ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ, అలాంటి వాటికి తావులేకుండా పోలీసులు కఠిన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఒక్క‌సారి శిక్ష‌ ప‌డితే సుమారు ఐదేళ్లు జైలు శిక్ష పడటం ఖాయమని న్యాయనిపుణులు అంటున్నారు. బెయిల్ కూడా దొరికే ప‌రిస్థితి ఉండ‌దని చెబుతున్నారు. దీంతో   వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌ భ‌యంతో వ‌ణికిపోతున్నది. జగన్ మెప్పుకోసం అనవసరంగా రెచ్చిపోయి ఇక్కట్ల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో ఈ సంవత్సరం జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) లోని సెక్షన్‌-111 ప్రకారం ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి. అసభ్య పోస్టులతో తాము ఎంతలా పేట్రేగిపోయినా పోలీసులు, చట్టాలు ఏమీ చేయలేవని, మహా అయితే అరెస్టు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తారని, అంతకు మించి ఏమీ కాదంటూ రోజురోజుకు రెచ్చిపోతున్న వారికి ఈ చట్ట ప్రకారమే ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం నేరం రుజువైతే ఐదేళ్లు జైలుకెళ్లే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పై పోలీసులు ఈ సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేస్తుండ‌టంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. వీడియోలు పెడుతూ త‌మ‌ను క్ష‌మించాల‌ని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మొత్తానికి కూట‌మి ప్ర‌భుత్వం ఇస్తున్న షాక్‌ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్ముకొని నిండా మునిగిపోయామ‌ని త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.