రోజురోజుకూ పెరుగుతున్న జంపింగ్ ల జాబితా.. వైసీపీ ఇక ఎంప్టీయేనా?

Publish Date:Aug 30, 2024

Advertisement

వైసీపీలో సంక్షోభం తార స్థాయికి చేరింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు ముందు ఆ పార్టీలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. మరో వైపు ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో స్వయంగా జగన్ కే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. పోలీసుల నోటీసు స్వీకరించి విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించక తప్పదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన ఉంటుందా? రద్దు అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న సమయంలో  ఆయన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాలకు వెళ్లడం ఏమిటని సొంత పార్టీ నేతలే అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పోతే వైసీపీ రాజ్యసభ సభ్యులలో అత్యధికులు పార్టీనీ వీడడానికి రెడీ అయిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం  జరుగుతోంది. సాధారణంగా అయితే ఆ ప్రచారాన్ని పార్టీ ఖండించాలి. లేదా పార్టీ మారిపోతున్నారంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కనీసం వారైనా అటువంటిదేమీ లేదనీ, తాము పార్టీలోనే కొనసాగుతామని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. కానీ వైసీపీ నుంచి కానీ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల నుంచి కానీ అటువంటి ఖండనలేవీ రాలేదు. ఒక్క విజయసాయి రెడ్డి మాత్రం ట్విట్టర్ వేదికగా అటువంటి ఖండన ఒకటి చేశారు. అయితే ఆయన అలా ఖండించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. యన తన ఖండన ద్వారా సొంత పార్టీ శ్రేణులలోనే జగన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? లేక పార్టీ మారిపోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా చేశాయి. ఎందుకంటే ఆయన గోడ దూకేస్తున్నారన్న ప్రచారం అంత వరకూ లేదు. విజయసాయి, సుబ్బారెడ్డి వినా వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఇంకెవరూ మిగలరన్న ప్రచారమే విస్తృతంగా జరుగుతోంది. అటువంటి సమయంలో తాను పార్టీ మారే ప్రశక్తే లేదంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఆ సంగతి అలా ఉంచితే.. 

పార్టీ అధిష్ఠానం ఎంపీలకు తాఖీదు పంపింది. పార్టీ మార్పు వార్తలను పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఖండించాలని ఆదేశించింది. జగన్ హయాంలో పాలన బ్రహ్మాండంగా సాగిందనీ, ప్రజా సేవలో తామంతా తరించామని చెప్పాలన్నది ఆ ఆదేశాల సారాంశం.  
ఆ తాఖీదు అందుకున్న తరువాత  ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి తాడేపల్లికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను పార్టీ మారే ప్రశక్తే లేదని చెప్పారు. అయితే ఆయన ఖండనను సొంత పార్టీ వారే నమ్మడం లేదు. అలాగే మరో  రాజ్యసభ సభ్యుడు కూడా హైదరాబాద్ లోనే మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ తాను పార్టీ మారే ఉద్దేశంలో లేనని చెప్పుకున్నారు. ఆయనను కూడా ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన పార్టీలను ఎలా మారుస్తారో అందరికీ తెలుసు. అసలు ఆయన వైసీపీలో చేరిందే రాజ్యసభ సభ్యత్వం కోసం అని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  వీరు వినా మరెవరూ తమ పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. అంటే వారంతా తాము వైసీపీని వీడుతున్నామని ధృవీకరించేసినట్లే. 

వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేసేశారు. వారి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించేశారు. అంటే ఇక వైసీపీకి రాజ్యసభలో మిగిలిన సభ్యులు తొమ్మిది మంది.   వీరిలోనూ పలువురు రాజీనామా బాటలోనే ఉన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను పట్టించుకోకుండా  తమ పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించని వాంతా మారిపోవడం ఖాయమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
సరే రాజ్యసభ సభ్యుల విషయం అలా ఉండగా పార్టీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామాల బాట పడుతున్నారు.  కర్రి పద్మ, బల్లి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం (ఆగస్టు 30)న రాజీనామాలు చేశారు. మరికొందరు   టీడీపీతో టచ్ లో ఉన్నారు.  వైసీపీ అధిష్ఠానానికి అందుబాటులోకి రావడం లేదు. దీంతో మండలి సభ్యులలో ఎంత మంది వైసీపీలో ఉంటారు? ఎందరు గోడ దూకేస్తారు అన్న విషయంలో క్లారిటీ లేదు.   

పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆ సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం మీద వైసీపీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, జగన్ విదేశీ పర్యటనకు ఇలా బయలు దేరగానే అలా పార్టీ చాలా వరకూ ఖాళీ అయిపోతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.