మహానాడుపై వైసీపీ విషం.. మాస్కులు ధరించి నాటకం!

Publish Date:May 24, 2025

Advertisement

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. తెలుగుదేశం చరిత్రలోనే తొలి సారిగా కడపలో మహానాడు జరుగుతోంది. ఈ ఏడాది మహానాడు నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. జగన్ అడ్డాలో ఈ నెల 27 నుంచి 29   నిర్వ‌హించే మ‌హానాడుకు ఇక రెండు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది.  వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి.  అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది.  

మహానాడు నిర్వహణకు అనుమతి రద్దు చేయండి అంటూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నాయకత్వంలో ప‌లువురు నాయ‌కులు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చేందుకు వారంతా మాస్కుల ధరించి వచ్చారు.  
ఇంతకీ మహానాడును ఆపేయాలంటూ వారు వినతి పత్రం ఎందుకు ఇచ్చారంటే.. కరోనా మహమ్మారి. కరొనా విజృంభిస్తున్న ఈ సమయంలో మహానాడు నిర్వహణ వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనీ, రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుందనీ వారా వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మహానాడుకు వచ్చే వాహనాలనూ అనుమించవద్దనీ, వాహనాలకు ఇప్పటికే లైసెన్సులు ఇచ్చి ఉంటే వాటినీ రద్దు చేయాలనీ వారా వినతిపత్రంలో కోరారు. 

ఇదంతా ప్రజల ఆరోగ్యం పట్ల తమకున్న అక్కర, ఆందోళనగా వారు చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటికే కడప .జిల్లాలో ఉనికి మాత్రంగా మిగిలిన వైసీపీ పలుకుబడి మహానాడు తర్వాత ఆ మాత్రంగా కూడా ఉండదన్న ఆందోళనే కారణమని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి కరోనా కేసులు అక్కడక్కడా ఒకటీ అరా వెలుగు చేసినప్పటికీ.. కేంద్రం ఇప్పటికే ఇప్పుడు కరోనా ప్రమాదకరమైన వైరస్ కాదని స్పష్టంగా ప్రకటించింది. ఎలాంటి అలర్ట్ ప్రకటించలేదు. ఆందోళన అవసరం లేదని ప్రజలకు భరోసా కూడా ఇచ్చింది.  

అయినా   వైసీపీ నాయ‌కులు  మ‌హానాడు నిర్వహణపై కరోనా బూచిని చూపుతూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.  కడపలో మహానాడు నిర్వహణతో తెలుగుదేశం పుంజుకుంటుందనీ, తమ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నభయంతోనే ఇప్పుడీ యాగీ చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ గద్దర్ అవార్డు వేడుకల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
రేపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన సినీ ప్రముఖుల సమావేశం వాయిదా పడింది. రేపు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ, అడవి శాఖ సలహాదారుడుగా కొమిర జాజి (అంకారావు) అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో హోంశాఖ మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉన్నంత వరకూ జగన్ ఆటలు సాగవని ఆమె హెచ్చరించారు.
ఫైనల్స్ అంటే ఒత్తిడికి గురవుతారన్న అపవాదు ఉన్న సఫారీలు దాన్ని అధిగమించి కంగారూలపై ఘన విజయం సాధించారు . దక్షిణాఫ్రికా జట్టు అస్ట్రేలియాపై అద్భత విజయం సాధించి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుంది.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి సేద్యం చేస్తూ రాధాకృష్ణ పారాయణం పటిస్తున్న కుర్మా గ్రామంలో ఇటీవలే సంభవించిన అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకొన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మెరీనా పినాకిల్ టైగర్ టవర్ గా పిలవబడే ఈ భవనం మొదటి అంతస్తులో ఏపీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి భవనం అంతటికీ వ్యాపించాయి.
శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని కూర్మ గ్రామంలో అగ్నికి ఆహుతవ్వడం దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ విషయంలో విధి వక్రీకరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ ప్రయాణానికి సంబంధించి అదే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వైసీపీ సవాల్ విసిరారు. మంళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రెండో రోజు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. గత కొంత కాలంగా గులాబీ దళపతి కోల్డ్‌తో బాధపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.