బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్‌.. జ‌గ‌న్ ప‌రువు తీసిన ష‌ర్మిల

Publish Date:Apr 9, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ నేత‌ల‌ ప్ర‌చారం పీక్ కు చేరింది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అధికార వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు ప‌డిపోతోంది. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లు కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యంకోసం విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వారి స‌భ‌ల‌కు ప్ర‌జాద‌ర‌ణ భారీగా ల‌భిస్తోంది.

మ‌రో వైపు పలు స‌ర్వేలు కూట‌మిదే అధికార‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నాయి. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌ను స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యం గూడుకట్టుకుంది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే  వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సొంత చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్‌ ష‌ర్మిల రూపంలో భ‌యం వెంటాడుతోంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో బాహాటంగానే చర్చ జరుగుతోంది. వివేకా హ‌త్య‌ కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అని వైఎస్ ష‌ర్మిల‌, సునీతా రెడ్డిలు చెబుతున్నారు. సీబీఐ విచార‌ణలోనూ అవినాశ్ రెడ్డి ప్ర‌ధాన నిందితుడ‌ని తేలింది. అయినా అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారాన్ని ఉప‌యోగిస్తున్నాకని ష‌ర్మిల, సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు అవినాశ్ కు మ‌రోసారి క‌డ‌ప ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై జ‌గ‌న్ చెల్లెళ్లు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే అవినాశ్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా వైఎస్ ష‌ర్మిల బ‌రిలోకి దిగారు. 

వైఎస్ ష‌ర్మిల ఈనెల 5  నుంచి క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలో విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ష‌ర్మిల‌కు మద్దతుగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిద్ద‌రూ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌ స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా వివేకా హ‌త్య వ్య‌హారాన్ని ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌, అవినాశ్ రెడ్డిల‌ను ఏకిపారేస్తున్నారు. ష‌ర్మిల దూకుడుతో క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలోని  వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది.  ష‌ర్మిల ప‌దునైన మాట‌ల‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంతో ష‌ర్మిల‌ను నిలువ‌రించ‌డం ఎలా అనే ఆలోచ‌న‌లో వైసీపీ నేత‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ ష‌ర్మిల పాల్గొనే స‌భ‌ల‌ను అడ్డుకొనే ప్ర‌య‌త్నాలను వైసీపీ ఆరంభించింది.  ఇప్ప‌టికే వివేకా హ‌త్య‌కేసు విష‌యంలో క‌డ‌ప‌లో వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డ‌గా,  ఇప్పుడు ష‌ర్మిల స‌భ‌ల‌ను అడ్డుకుంటే ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగి మరింత ఇబ్బంది ఎదురవుతుందని వైసీపీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే, ష‌ర్మిల దూకుడుకు క‌ళ్లెం వేయ‌డం ఎలా అనే చ‌ర్చ వైసీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే జగన్ వ్యూహాత్మకంగా ష‌ర్మిల స‌భ‌ల‌కు కొంద‌రు వైసీపీ ద్వితీయ స్థాయి నేత‌లను పంపిస్తున్నారు. వారు ష‌ర్మిల మాట్లాడే స‌మ‌యంలో జై జ‌గ‌న్,  జైజై జ‌గ‌న్‌ అనే నినాదాలు చేస్తూ స‌భ‌లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తేలా చేస్తున్నారు. దానిని తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ష‌ర్మిల స‌భ‌ల్లో  జై జ‌గ‌న్   నినాదాలు వినిపిస్తున్నాయి, ష‌ర్మిల‌కు క‌డ‌ప ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నదంటూ ప్ర‌చారం చేసుకోవాలని ప్లాన్ చేశారు. 

అయితే జగన్, వైసీపీ నేత‌ల చిల్ల‌ర చేష్ట‌ల‌ను ప‌సిగ‌ట్టిన వైఎస్ ష‌ర్మిల వారికి త‌గిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. సోమ‌వారం(ఏప్రిల్ 8) క‌డ‌ప జిల్లా దువ్వూరులో ష‌ర్మిల ప్ర‌చారం నిర్వ‌హించారు. అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ష‌ర్మిల మాట్లాడుతుండ‌గా  జై జ‌గ‌న్ అంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు నినాదాలు చేశారు. వైసీపీ నేత‌ల కుట్ర‌ల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టిన ష‌ర్మిల‌   వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మాట్లాడేందుకు ఆహ్వానించారు. ద‌మ్ముంటే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడండి.. మీ జ‌గ‌న‌న్న ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పండి చూద్దాం అంటూ సూచించారు. వైసీపీ నేత‌ ష‌ర్మిల వ‌ద్ద‌కు వ‌చ్చి మైక్ అందుకొని జ‌గ‌న్ గురించి మాట్లాడాడు. ఆయ‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్ ఏం అభివృద్ధి చేశాడో చెప్ప‌కుండా.. కేవ‌లం జ‌గ‌న‌న్న అంటేమాకు అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు. అనంత‌రం ష‌ర్మిల మైక్ అందుకొని.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఒకప్పుడు నేను జై జ‌గ‌న్ అన్నా.. ఆయ‌న జైలుకెళ్తే 3,200 కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసి పార్టీని నిల‌బెట్టా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా పాల‌న చేస్తారని అనుకున్నా.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారు. సొంత బాబాయ్ హ‌త్య‌కు కారుకుల‌ను ప‌క్క‌న పెట్టుకొని ఎంపీ టికెట్ ఇచ్చాడు.. అస‌లు జ‌గ‌న్ వైఎస్ వార‌సుడే కాదు,  అస‌లైన వైఎస్ వార‌సురాలిని నేనే అంటూ వైసీపీ నేత‌ల‌కు  దిమ్మ‌తిరిగే షాకిచ్చారు ష‌ర్మిల. 

రాయ‌ల‌సీమ జిల్లాల్లో వైసీపీకి బ‌లం ఎక్కువ‌. ఆ ప్రాంతంలో 52 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.  2014, 2019 ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ ప్రాంతంలో వైసీపీ హ‌వా కొన‌సాగింది. కానీ, ఈసారి ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కూట‌మి బ‌ల‌ప‌డ‌టంతోపాటు వైఎస్ ష‌ర్మిల రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి షాక్ త‌గిలే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో నిందితుడుగా ద‌ర్యాప్తు సంస్థ‌లు పేర్కొన్న అవినాశ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై ష‌ర్మిల‌తో పాటు ఉమ్మ‌డి క‌డ‌ప  జిల్లాలోని అధిక శాతం మంది ప్ర‌జ‌ల నుంచి  వ్య‌తిరేక‌త వ్య‌క్తవుతుంది. ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తుండ‌టంతో పాటు, అస‌లైన వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి వార‌సురాలు తానేనని ఆమె ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌గ‌లుగుతున్నారు. ఒక ప‌క్క కూట‌మి దెబ్బ‌తోపాటు ష‌ర్మిల ఎఫెక్ట్ కూడా రాయ‌ల‌సీమ ప్రాంతంలో వైసీపీ అభ్య‌ర్థుల‌ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసే పరిస్థితి ఉంద‌ని జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం.  దీంతో వైఎస్ ష‌ర్మిల దూకుడుకు ఎలా అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ పెద్ద‌లు త‌ల‌మున‌క‌ల‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ ష‌ర్మిల దూకుడుతో ఉమ్మ‌డి క‌డ‌ప  జిల్లాలోని వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యం మొద‌లైంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది.

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.