Publish Date:Nov 21, 2024
వైసీపీ అధినేత జగన్ కు స్వప్రయోజనాలు తప్ప ప్రజా క్షేమం, ప్రజా ప్రయోజనాలు ఇసుమంతైనా పట్టవని మరో మారు నిర్ద్వంద్వంగా రుజువైపోయింది. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటూ సభ్యుల సంఖ్యను బట్టి కనీసం 18 మంది ఎమ్మెల్యేలుగా గెలివాల్సి ఉండగా జగన్ నాయకత్వంలోని వైసీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో జగన్ వైసీపీ అధినేతే అయినా విపక్ష నేత హోదా లేకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే సభలో కూర్చోవలసి ఉంటుంది. దీంతో ఆయన విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తన ఒక్కడికే ఆ బహిష్కరణను పరిమితం చేయకుండా మొత్తం వైసీపీ సభ్యులందరినీ సభకు హాజరు కాకుండా ఆపేశారు.
అయితే ఇప్పుడు పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలు కావడంతో వైసీపీ ఆలోచనలో మార్పు వచ్చింది. పీఏసీ చైర్మన్ కు కేబినెట్ హోదా ఉంటుంది. ఆ హోదాతో పాటు వచ్చే సౌకర్యాలూ అందుతాయి. దీంతో వైసీపీ ఆ పదవిపై కన్నేసింది. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేను పీఏసీగా చేయడం సాంప్రదాయం. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేదు. దీంతో సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమనే ప్రశ్నే తలెత్తదు. కానీ కేబినెట్ ర్యాంక్ కోసం తహతహలాడిపోతున్న జగన్, ఆయన పార్టీ.. ఇప్పుడీ పీఏసీ చైర్మన్ పదవి కోసం అర్రులు చాస్తోంది. ఈ పదవికి నామినేషన్ వేయడానికి రెడీ అయిపోయింది. ఆ పదవి కోసం మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అయితే పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ వైసీపీకి ఆ బలం లేదు. బలం లేకపోయినా వైసీపీ బరిలోకి దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
నిబంధనల మేరకు పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులలో తొమ్మండుగురు అసెంబ్లీ నుంచీ, ముగ్గురు శాసనమండలి నుంచి ఎన్నికౌతారు. అయితే పీఏసీ చైర్మన్ను మాత్రం ఎమ్మెల్యేల నుంచే ఎన్నుకుంటారు. గత అసెంబ్లీలో తెలుగుదేశం కు ప్రతిపక్ష హోదా ఉంది కనుక పయ్యావుల కేశవ్ కు అప్పుడు పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. అసెంబ్లీ నుంచి పీఏసీకి వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఎన్నికయ్యే అవకాశం లేదు. అయినా తగుదునమ్మా అంటూ పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించడానికి వైసీపీ అధినేత జగన్ తయారైపోయారు. అయితే కేబినెట్ హోదా కోసం వేస్తున్న నామినేషన్ ఆయనే స్వయంగా వేస్తే సరిపోయేదిగా అని తెలుగుదేశం వర్గీయులు ఎగతాళి చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-mla-peddireddy-nomination-for-pac-39-188738.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.