వంకర బుద్ధి విమర్శలు ఇకనైనా ఆపండయ్యా!

Publish Date:Oct 9, 2024

Advertisement

వైసీపీ తీరు గమనించిన ఎవరికైనా ఆ పార్టీకి పిడుక్కీ బియ్యానికీ ఓకే మంత్రం అన్న మాట స్ఫురిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా ఒకే విధంగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థులను విమర్శించడానికి ఆ పార్టీకి అంశాలేవీ అవసరం లేదు. ఎందుకు విమర్శిస్తున్నామో తెలియాల్సిన అవసరం కూడా లేదు. మైకు ఉంటే చాలు ప్రత్యర్థి నాయకుల వ్యక్తిగత అంశాలను పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం రివాజుగా మారిపోయింది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ విమర్శలనే తీసుకుంటే.. ఓ పద్ధతీ పాడూ ఉన్నట్లు కనిపిం చదు. ఆ పార్టీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలంతా పవన్  వ్యక్తిత్వ హననమే లక్ష్యం అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సమయంలోనూ, ఇప్పుడు అధికారం లేని సమయంలోనూ కూడా పవన్ కల్యాణ్ వివాహాల గురించే అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంశాలపై విమర్శించేందుకు వారికి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా దొరక లేదు.

ఇప్పుడు తాజాగా ఆయన కుమార్తె పోలెనా అంజనా పవనోవాపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ తన పెద్ద కుమార్తె ఆద్యతో కలిసి దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గ గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు. అయితే వైసీపీయులు మాత్రం పవన్ తన రెండో కుమార్తె పోలెనా అంజనా పవనోవా ఎందుకు రాలేదంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తిరుమలలోలా బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో డిక్లరేషన్ రాజకీయం చేయడానికి అవకాశం లేదు కనుకే ఆమె రాలేదంటూ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో పవన్ రెండో కుమార్తె పోలెనా అంజనా పవనోవా డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించు కున్నారు. అంటే హిందూ ధర్మంపైనా, హిందూ దేవుళ్లపైనా తనకు విశ్వాసం ఉందని ప్రకటించేశారు. ఇక ఆవిషయంలో రాజకీయం చేయడానికి ఏమీ లేదు. అయినా వైసీపీయులు అదే పట్టుకు వేళాడుతున్నారు. ఇప్పుడు అవే ప్రశ్నలను జనసేనాని కానీ జనసైనికులు కానీ జగన్ కు సంధిస్తే సమాధానం ఇచ్చుకోగలరా? డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకే జగన్  ఇటీవల తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా అంగీకరించే ధైర్యం లేక ఇదేనా సెక్యులరిజం అంటే అంటూ ప్రశ్నలు గుప్పించి మొహం చాటేశారు.

అయితే పవన్ కల్యాణ్ మాత్రం అలా కాకుండా తన రెండో కుమార్తె క్రిస్టియన్ కనుక డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీవారి దర్శనం చేసుకుంటుందని చాటి అలాగే చేయించారు. అన్ని మతాలనూ సమానంగా గౌరవించడమే సెక్యులరిజం అంటే అని చాటారు. ఇప్పుడు కూడా పోలెనా అంజనా పవనోవా దర్గమ్మ దర్శనానికి రాకపోవడానికి కారణాలేమిటన్నది తెలియకపోయినా.. నేడు కాకపోతే రేపైనా ఆమెను దుర్గగుడికి పవన్ కల్యాణ్ తీసుకురాగలరు.. అలా తీసుకువచ్చి.. జగన్ కు భారతిని తీసుకురాగలరా అని సవాల్ చేస్తే ఆయన పరిస్థితి ఏమిటి? సమాధానం చెప్పుకోగలరా? వైసీపీయుల విమర్శలు జగన్ ను చిక్కుల్లోకి నెట్టేయవా? అందుకే  ఈ విషయంలో తమ మంచి కోసమైనా వైసీపీయులు నోరు కట్టేసుకుంటే మేలు అని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.