భ్ర‌మ‌లు తొల‌గిపోయాయా?

Publish Date:Jan 26, 2025

Advertisement

విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ నేతలకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చేసింది. నోటికి తాళాలు వేసింది. తన రాజకీయ భవిష్యత్ పై బెంగపుట్టేలా చేసింది. ఇంత కాలం కూట‌మి ప్ర‌భుత్వం మ‌రికొద్ది నెల‌ల్లో కూలిపోతుంది.. మ‌ళ్లీ మ‌న జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతారు.. మ‌రో రెండేళ్ల‌లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. సీఎం అయ్యేది మ‌న జ‌గ‌నే.. క‌ళ్లు మూసి తెరిచేలోపు రెండేళ్లు అయిపోతాయి.. మ‌ళ్లీ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడు అన్న భ్రమలను తొలగించేసింది.

నిన్న మొన్నటి వరకూ త‌మ పార్టీలో ఏం జ‌రుగుతుందో గుర్తించలేని నేత‌లు సైతం మైకుల ముందుకొచ్చి పూన‌కం వ‌చ్చిన‌ట్లు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. అయితే, ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల నోట మాట రావ‌డం లేదు. వైసీపీలో అంత‌ర్గ‌తంగా ఏం జ‌రుగుతుందో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌న భ‌విష్య‌త్ ఏంట్రా బాబూ అంటూ ఆ పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల‌ నుంచి మండ‌ల స్థాయి నేతల వ‌ర‌కు డైల‌మాలో ప‌డిపోయారు. విజ‌య‌సాయి రెడ్డి రాజీనామా వైసీపీని ఓ కుదుపు కుదిపేసింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విదేశీ టూర్ లో ఉండ‌గానే విజ‌య‌సాయిరెడ్డి షాకివ్వ‌డంతో ఆ పార్టీ నేత‌లు తేరుకోలేక పోతున్నారు. కూట‌మి పార్టీలు బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

 వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న సాగించారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపించాడు. భూ క‌బ్జాలు, ఇసుక, మ‌ట్టి, మ‌ద్యం దందా ఇలా ప్ర‌తీ దాంట్లోనూ కోట్లాది రూపాయ‌లు జేబుల్లో వేసుకున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు గాలికొదిలేసి త‌మ జేబులు నింపుకోవ‌టానికే వైసీపీ నేత‌లు ప్రాధాన్య‌త‌నిచ్చారు. దీనికితోడు ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై నోటికొచ్చినట్లు దూషణలు చేశారు. బూతులతో రెచ్చిపోయారు. ఇక వైసీపీ సోష‌ల్ మీడియా అరాచ‌కం గురించి ఎంత చెప్పినా తక్కువే. అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నేత‌ల ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలోకి వెళ్లిందంటే 175 సీట్ల‌లో క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ప్ర‌క‌టించేసుకున్నారు. చంద్ర‌బాబు సైతం ఓడిపోతాడ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేత‌ల పిచ్చిచేష్ట‌ల‌ను భ‌రించిన ఏపీ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిపక్ష హోదాకూడా ఇవ్వ‌కుండా 11 సీట్ల‌కే ఆ పార్టీని ప‌రిమితం చేశారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా వైసీపీ నేత‌ల ఆగ‌డాల‌కు పూర్తి స్థాయిలో అడ్డుక‌ట్ట ప‌డ‌లేదు. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల‌ రోజుల నుంచే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రోడ్ల‌పైకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. రెడ్ బుక్ అంటూ ఢిల్లీ వెళ్లి నానా రాద్ధాంతం చేశాడు. మ‌రో రెండేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం కూలిపోతుంది.. రాజ్య‌స‌భ‌లో మ‌న‌మే బ‌లంగా ఉన్నాం.. బీజేపీ మ‌న వెంటే ఉందంటూ వైసీపీ శ్రేణుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సైతం జ‌గ‌న్ వ‌ద్ద అక్ర‌మ సంపాద‌న భారీగా ఉంది.. సొంత మీడియా ఉంది.. సోష‌ల్ మీడియా ఉంది.. ఏదైనా చేయ‌గ‌ల‌డు అని భ్ర‌మ‌ప‌డ్డారు. కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అక్ర‌మాల‌పై దృష్టిసా రించ‌డంతో ఒక్కొక్క‌రుగా వైసీపీ నేత‌ల మెడ‌కు అవినీతి ఉచ్చుబిగిస్తూ వ‌స్తుండటంతో వారిలో భయం మొదలైంది.  దీంతో పార్టీ శ్రేణుల‌ను రోడ్ల‌పైకి వ‌చ్చి కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌నలు చేయాల‌ని చెప్పిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. ఏదైనా ప‌ని ఉన్న‌ప్పుడు మాత్ర‌మే తాడేప‌ల్లి ప్యాలెస్ కు వ‌స్తున్నారు. అయినా, అక్ర‌మ సంపాద‌న‌తో ఏర్పాటు చేసుకున్న జ‌గ‌న్‌ సొంత మీడియా, సోష‌ల్ మీడియా నిత్యం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చింది. మ‌న‌మే అధికారంలోకి వ‌స్తున్నాం.. మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అవు తారు.. ఎవ‌రికీ భ‌య‌పడొద్దు అంటూ వారిని రెచ్చ‌గొడుతూ వచ్చింది.. దీంతో ప‌లువురు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ ప్ర‌భుత్వ‌మే అన్న‌ట్లుగా రెచ్చిపోయారు. ప్ర‌స్తుతం వారి భ్ర‌మ‌లు తొల‌గిపోతున్నాయి. ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతుండ‌టంతో భ‌యం ప‌ట్టుకుంది. 

వైసీపీ అధికారం కోల్పోయిన నాటినుంచి ఆ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, ఇన్నాళ్లు అవేమీ పెద్దగా ప‌ట్టించుకోని ఆ పార్టీ శ్రేణులు.. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో డీలా ప‌డిపోయాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా.. పార్టీలో కీల‌క నేత‌గా విజ‌య‌సాయిరెడ్డి కొన‌సాగుతూ వ‌చ్చారు. అయితే, జ‌గ‌న్ లండ‌న్ వెళ్లిన స‌మ‌యంలో చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాడు.   రాజ‌కీల‌కే గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లు మ‌ళ్లీ మ‌న‌మే అధికారంలోకి వ‌స్తాం అంటూ భ్ర‌మ‌ల్లో ఉన్న వైసీపీ నేత‌ల్లో   వణుకు మొదలైంది. రాబోయే రోజుల్లో భారీ సంఖ్య‌లో వైసీపీ నేత‌లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌ వుతున్నారు. మ‌రో ఏడాది నాటికి జ‌గ‌న్‌, మ‌రో ప‌దిమంది నేత‌లు మాత్ర‌మే వైసీపీలో మిగిలే ప‌రిస్థితి. దీంతో ఇన్నాళ్లూ జ‌గ‌న్ మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా మ‌న‌కు అండ‌గా ఉందంటూ రెచ్చిపోయిన వైసీపీ నేత‌లు కూట‌మి పార్టీల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. మొత్తానికి మ‌ళ్లీ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడంటూ మైకు దొరికిన‌ప్పుడ‌ల్లా ఉప‌న్యాసాలు ఇచ్చిన నేత‌ల భ్ర‌మ‌లు తొల‌గిపోయాయి.

By
en-us Political News

  
పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వైసీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం (జూన్ 27) గుడివాడకు వచ్చా రు . గత ఏడాది జరిగిన ఎన్ని కలలో పరాజయం తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్ననాని అకస్మాత్తుగా గుడివాడకు ఎందుకు వచ్చారంటే ఓ కేసులో నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నమ్మలేని నిజాలు బయటకు వస్తున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ దూకుడు పెంచింది. పాత చిట్టాకు కొత్తగా యాడవుతున్న ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరినీ పిలిచి వాగ్మూలాలను నమోదు చేస్తోంది. సిట్ నిజానికి, ఇంతవరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంలో సిట్ కు కూడా స్పష్టత లేదని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప, అలియాస్ మీసేవ బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.
ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లుకు కల్తీ డీజిల్ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
సింగయ్య మతి కేసులో ఏ2గా ఉన్నజగన్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు జులై 1కి వాయిదా వేసింది. ఆ సందర్భంగా అప్పటి వరకూ జగన్ పై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. పురుషుల సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
మంత్రి సీతక్కను టార్గెట్ చేస్తూ, మావోయిస్టులు ఆమె తమ మూలాలను మరిఛిపోయారని హెచ్చరిస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందా? ఆయన వరుస వివాదాలలో చిక్కుకోవడానికి కారణాలేంటి? ఎవరైనా ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్‌ చేసి వివాదాల్లో నెడుతున్నారా?.. గుంటూరులో జగన్ కాన్యాయ్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసులో జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించింది ఎవరు? తీవ్ర కలకలం రేపిన ఆ ప్రమాదానికి సంబంధించి వినిస్తున్న ప్రచారంపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 డీహెచ్‌ 2349 కారు ఫిట్‌నెస్‌ను ఎంవీఐ గంగాధర ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.