రాజధాని అంశం బెడిసికొట్టేలానే ఉంది.. వైసీపీ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుంది!!

Publish Date:Dec 31, 2019

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలిస్తుండడంపై అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన ఉద్యమం రాష్ట్రం నలుమూలలకు విస్తరిస్తోంది. కోస్తాలో కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు కూడా పాకింది. రైతుల ఆందోళనను తొలుత లైట్ గా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత సెగ తగులుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగం గానే పరిపాలన ఒకే చోట ఉండాలని శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ ఒక చోట ఉంటేనే నిర్ణయాలు వెంటనే తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అలా చేసిన మరుసటి రోజే అగ్రనేతలు ఒత్తిడితో ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్లీనంగా ఉన్న భావన ఏమిటో తెలిసిపోయింది. 

అమరావతి ప్రాంత గ్రామాల్లో విస్తరించిన నియోజక వర్గాల ఎమ్మెల్యేలు తమకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందేనని భావిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రాజకీయ సెగ ఎక్కువైంది. తమ నియోజక వర్గాల ఎమ్మెల్యేల వద్దకు సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే వెళ్లి ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సదరు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందని చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రి వర్గ సమావేశానికి ముందు రోజు సీఎం జగన్ నివాసంలో ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో నిరసనలూ ఆందోళనలూ పెరిగాయని తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తేల్చి చెప్పేశారు. రాజధాని రైతుల ఆందోళనలు.. అక్కడి మహిళల కన్నీరు.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గాల్లో సామాన్య ప్రజానీకం కూడా రాజధాని అమరావతిని తరలించడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారని వివరించారు. శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది కదా అని వ్యాఖ్యానించగా అసెంబ్లీ సమావేశాలు కూడా కేవలం శీతాకాలానికే పరిమితం చేయడం గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్టు తెలిసింది. దీనివల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టమేనని రాజధానిని తరలించుకుపోతున్నారనే ఆవేదన ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. కోస్తాంధ్ర ప్రజలు రోడ్డు మీదకు రారని.. సమయం చూసి వాతపెడతారని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఓ ప్రముఖుడు మాత్రం చంద్రబాబు రాజధానిని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తే ఆ రాజధాని ఏర్పాటైన తాడికొండ, మంగళగిరి నియోజక వర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. 2 జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ ప్రముఖుడు ఎమ్మెల్యేలకు హితవు చెప్పారు. అయితే రాజధానిపై ఈ వాదన తెస్తున్న ఆ ప్రముఖుడి అభిప్రాయాలు బయటకొచ్చాక ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేస్తే, విశాఖలో పాలన రాజధానిని ఏర్పాటు చేస్తే రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయనే నమ్మకం ఉందా అని నిలదీశారు. 

మొత్తం మీద ఇలాంటి వాద ప్రతివాదనలు అధికార పార్టీ ఎమ్మెల్యేలను లోలోపల కలవర పరుస్తున్నాయని తెలుస్తోంది. రాజధాని రైతులకు న్యాయం చేయాలని.. వారి సమస్యలను పరిష్కరించిన తర్వాతనే రాజధాని తరలింపు పై ఓ నిర్ణయానికి వస్తే బావుంటుందని కూడా వారు సూచించినట్టు సమాచారం. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతానని సదరు ప్రముఖుడు కూడా హామీ ఇచ్చారు. కాని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేల ఫేస్ రీడింగ్ చూస్తే మాత్రం అంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించలేదు. బయటకేమో తామంతా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. కానీ లోపల జరిగిన తంతు నిదానంగా బయటకు పొక్కడంతో తమ నియోజక వర్గాల ప్రజలకు సదరు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.

By
en-us Political News

  
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.