Publish Date:Oct 31, 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దాడులు కామన్ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార దర్పంతో వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారు. తమను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రతిపక్ష నేతలేనే కాదు.. తమకు సహకరించని ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కర్నూల్ జిల్లాలో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. కత్తితో దాడి చేయడంతో ఎస్ఐ చేతికి గాయమైంది. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం వరకు కోడుమూరు ఎస్ఐగా పనిచేసిన వేణుగోపాల్ ప్రస్తుతం వీఆర్లో ఉన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఇద్దరు సిబ్బందితో కలిసి వీఆర్ ఎస్ఐ వేణుగోపాల్ మఫ్టీలో వెళ్లి గోరంట్లలో అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేశారు. మద్యం దొరక్కపోవడంతో తిరుగుముఖం పట్టారు. ఇంతలో గోరంట్ల సర్పంచ్ అనుచరులు ఎస్ఐ వాహనాన్ని బైక్లతో అటకాయించారు. తాము సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులమని ఐడీ కార్డు చూపినా వినిపించుకోలేదు. తమ గ్రామానికే వస్తారా అంటూ నానా దుర్భాషలాడారు.
‘ఇప్పుడే మా సర్పంచ్కు ఫోన్ చేశాం. పోలీసుల దూకుడు ఎక్కువైంది. ఒక్కరిని చంపేస్తే ఇంకెవరూ గ్రామంలోకి రావడానికి ధైర్యం చేయరు’ అని బెదిరించారు. ఇంతలో వారిలో ఒకరు ఎస్ఐపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ ఎడమ చేతికి గాయమైందని సీఐ తెలిపారు.అక్కడి నుంచి వచ్చిన ఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు సర్పంచ్ బాలకృష్ణతోపాటు అతడి అనుచరులు ఐదుగురిపై ఐపీసీ సెక్షన్లు 341, 353, 307, 506 రెడ్విత్ 34 కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ప్రధాన నిందితుడు సర్పంచ్ సద్దల బాలకృష్ణను కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
ఈనెల 26వ తేదీ రాత్రి గోరంట్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సర్పంచ్ సద్దల బాలకృష్ణ అనుచరులు కావడంతో.. ఎమ్మెల్యే సుధాకర్పై సర్పంచ్ ఒత్తిడి తెచ్చి వారిని విడిపించుకున్నారని అంటున్నారు. మద్యం అక్రమార్కులను వదిలిపెట్టడంతో ఎస్ఐ వేణుగోపాల్ను వీఆర్కు పంపారనే చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-leaders-attack-si-in-kurnool-dist-39-125577.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.