Publish Date:May 17, 2024
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు తయారయ్యింది.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైసీపీ నేత కోసేశాడు. బాధితులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు... పందువ గ్రామానికి చెందిన తిమోతి ఇటీవలే వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాడు. ఎన్నికల సమయంలో బంధువులు, చుట్టుపక్కల వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విషయాలను వివరించాడు. ఈ నేపథ్యంలో తిమోతిపై స్థానిక వైసీపీ నేత గురవయ్య అక్కసు పెంచుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-in-frustration-39-176199.html
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.
ఏపీ లోక్సభ సర్వే మరింత విస్తారంగా...
లోక్సభ స్థానాల్లోనూ వైసీపీకి పెద్ద దెబ్బ
ఏపీలో ఎవరు గెలవబోతున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతోందా? మరో సారి వైసీపీ అధికార పీఠాన్ని దక్కించుకోబోతుందా? ఒకవేళ తెలుగుదేశం కూటమి గెలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు వైసీపీకి ఘోర పరాభవం తప్పదా?
ap parliment Exit polls, exit poll, ap exit polls, andhra pradesh elections 2024, ap elections 2024, exit poll, pre poll survey
కూటమిదే భారీ విజయం: జనగళం
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం హవానే సూచిస్తున్నాయి. దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ముందుగా పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమికి 125 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయి.
టీడీపీ కూటమికే ఘన విజయం దక్కనుందని రైస్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. తెలుగుదేశం కూటమికి 113 నుంచి 122 సీట్లు వస్తాయిని, వైసీపీకి 48 నుంచి 60 సీట్లు వస్తాయని, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం వుందని రైస్ సర్వే వెల్లడించింది.
కేకే సర్వే కూడా కూటమి వైపే.. వైసీపీకి 14 సీట్లే!
కూటమిదే ఘన విజయం: పీపుల్స్ పల్స్ సర్వే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి దాదాపు ఇరవై రోజులు కావొస్తున్నది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మేమే అధికారంలోకి వస్తున్నామని తెలుగుదేశం, వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోసారి జగన్ సీఎం అవుతారని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. పోలింగ్ సరళిని చూస్తే అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని మరిచి కేవలం కక్షపూరిత రాజకీయాలకే పరిమితం కావటంతో ప్రజలు విసిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్డీయే కూటమిదే పైచేయి అని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది.