Publish Date:Jul 16, 2022
మండపేటలో జనసేన రైతు భరోసా యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ ఏపీకి హానికరంగా మారిందన్నారు. మరో సారి జగన్ సర్కార్ అధికారంలోకి వస్తే ఏపీకి అంధకారమేనన్నారు. పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్ మహాత్మాగాంధీ అయిపోరని, ఆయన అధికారం కోసమే నడిచారన్నారు.
ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ చైతన్యం ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పు రావాలన్నారు. కోనసీమ విధ్వంసం వెనుక ఉన్నది వైసీపీయే అని ఆరోపించారు. నిజంగా అంబేడ్కర్ మీద ప్రేమతో కాకుండా రాజకీయ దురుద్దేశంతో కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టారని విమర్శించారు. అంబేడ్కర్ ను రాజకీయాలకు వాడు కోవడం సరికాదన్నారు.
ఈ సభ వేదికగా ఆయన పొత్తులపై మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆయన పొత్తుల గురించి నేరుగా ప్రస్తావించలేదు. ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ అన్నారు. అదే సమయంలో రాష్ట్ర్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే అంధకారమే అని హెచ్చరించారు. అభ్యర్థిని చూసి కాకుండా తనను చూసి ఓట్లేయాలని జనసేనాని అన్నారు.
ఓడినా ప్రజలకు అండగా ఉంటానని అనడం, అదే సమయంలో 2024 ఎన్నికలలో జనసేన విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేయడంపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. తనను చూసి ఓటేయండి అభ్యర్థిని చూసి కాదు అనడం వెనుక పొత్తులకు సంబంధించిన సంకేతమేమన్నా ఉందా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద పవన్ కల్యాణ్ జనసేన రైతు భరోసా యాత్రలో ఎన్నికల శంఖారావం మోగించేశారనీ, వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యంగా ప్రకటించేశారనీ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవడం, తెలుగుదేశంపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోవడంతో రాష్ట్ర్రంలో మళ్లీ 2014 ఎన్నికల నాటి పొత్తులకు ఏమైనా అవకాశం ఉందా అన్న కోణంలో కూడా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-harmful-to-ap-says-pawan-25-139910.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!