వైసీపీకి మోడీయే దిక్కు.. కుండబద్దలు కొట్టేసిన నల్లపురెడ్డి

Publish Date:May 19, 2025

Advertisement

వైసీపీ బతికి బట్టకట్టాలంటే మోడీని శరణు జొచ్చడం వినా మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా? ఇదే విషయాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా పార్టీ అధినేత జగన్ కు చెబుతున్నారా?  అసలు 2024 ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయానికి బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడమే కారణమని భావిస్తున్నారా? అన్న ప్రశ్నలకు ఈ పార్టీ సీనియర్ నేతల మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు,  కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి   పార్టీకి భవిష్యత్ ఉండాలంటే జగన్ మోడీని శరుణు వేడి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎలాంటి శషబిషలకూ తావివ్వకుండా.. 2024 ఎన్నికల సమయంలో జగన్ బీజేపీతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోకపోవడమే పార్టీ పరాజయానికి కారణమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  కనీసం వచ్చే ఎన్నికలలో అయినా, అంటే 2029 ఎన్నికల నాటికైనా వైసీపీ బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే పార్టీ మనుగడ ఉంటుందని అన్నారు.  ఇదే విషయాన్ని  తాను నేరుగా జగన్ కు కూడా చెబుతానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

2024 ఎన్నికల సమయంలో బీజేపీ కోరినప్పటికీ జగన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశారనీ, అప్పుడు పొత్తు వద్దనుకోవడం వల్లనే వైసీపీ ఆ ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిందని అన్నారు. అలా అనడం ద్వారా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అప్పటి జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టారు.  వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మోడీ సర్కర్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందనీ, అలాంటప్పుడు.. ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడం తప్పేనన్నారు.   కనీసం వచ్చే ఏన్నికలలోనైనా జగన్ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్నారు. బీజేపీతో పొత్తు ఉంటేనే వైసీపీకి భవిష్యత్ ఉంటుందన్నారు. 

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.