Publish Date:Aug 24, 2022
వైసీపీ నాయకులు మంత్రుల వ్యవహార శైలి ఏదో టీవీ షోలో బిల్డప్ బాబాయ్ చేసే పెచ్చులను మించి పోతోందని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రోజా తిరుమల స్వామి వారి దేవాలయంలో అనుచరులతో చేసిన హల్ చల్ మరువక ముందే రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫోటో షూట్ పేరిట చేసిన హంగామా ఇప్పుడు సమాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురౌతోంది. ఇటీవల ఆయన ఫొటో షూట్ పేరిట చేసిన హడావుడి నవ్వుల పాలు కావడమే కాకుండా విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ఏదో ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తెరకెక్కుతోందా అన్నట్లుగా ఆ హంగామా సాగింది. ఇంతకీ ఆ హడావుడి అంతా మంత్రిగారు వివిధ పోజుల్లో ఫొటోలు దిగేందుకేనని ఆ తరువాత తేలింది. ఈ సందర్భంగా ఆయన పొటోలకు ఇచ్చిన పోజులు నేల విడిచి సాము చేసిన చందంగా ఉన్నాయని సెటైర్లు పేలుతున్నాయి. మంత్రి గుడివాడ గుర్నాథ్ కు బిల్డప్ బాబాయ్ అన్న ట్యాగ్ కూడా తగిలించేశారు నెటిజన్లు. మరో వైపు మంత్రిగారు పోజులు పెడుతూ దిగిన పొటోలు విపక్షాలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి షేర్లు చేస్తున్నారు.
గుడివాడ అమర్నాథ్ మంత్రిగా రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు కానీ.. పెట్టుబడులు కానీ తీసుకు వచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించేందుకు మాత్రం అపరాత్రి, అర్దరాత్రి అన్న తేడాలేకుండా ఎవర్ రెడీగా ఉంటారని మాత్రం పరిశీలకులు అంటుంటారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో గుడివాడ అమర్నాథ్ కు పేరుకు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు కానీ ఆయనకు అప్పగించిన పని మాత్రం జనసేనానిపై విమర్శలు గుప్పించడానికేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే మంత్రి అంబటి రాంబాబుకు పేరుకు జల వనరుల శాఖ ఇచ్చినా.. ఆయనకు అప్పగించిన పని మాత్రం తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికేనని అంటున్నారు. జగన్ తొలి కేబినెట్ లో ఇలా తిట్ల శాఖల మంత్రులుగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు ఉండేవారనీ, ఇప్పుడు వారి స్థానాలను గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులు బర్తీ చేశారని అంటున్నారు.
అలాగే నాటి మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు.. ఫోన్ కాల్ వ్యవహారం సైతం సోషల్ మీడియాలో గంట... అరగంట.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టి రచ్చ రచ్చ చేసి పారేశారు. ఇక థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ, నటుడు పృద్దీరాజ్ సైతం ఎస్వీబీసీ చానల్ చైర్మన్గా బాద్యతలు చేపట్టి.. పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే.. మహిళతో అసభ్యంగా పోన్ కాల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి... ఉద్వాసనకు గురయ్యారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీలోని ప్రజా ప్రతినిధుల తీరుతెన్నులపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ఎండగడుతున్నా.. వారు మాత్రం... తమ స్టైల్ ఇదే అన్నట్లుగా వ్యవహరించడంపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ సంగతి అందరికి తెలిసిందే. దీంతో యాధా అధినేత.. తధా నాయకుడు అన్నట్లుగా ఉందని నెటిజన్లు(సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.)
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-full-of-build-up-babais-25-142554.html
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.