పెమ్మ‌సాని జోరు.. వైసీపీ బేజారు!

Publish Date:Apr 6, 2024

Advertisement

గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీకి కిలారు రోశయ్య వెనుకంజ

మళ్లీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్

అళ్లను బరిలోకి దింపే యోచన

ఓడినా సరే పోటీ చేయాలని ఆర్కేకు జగన్ హుకుం?

ఏపీలో ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు.. ఆ పార్టీని గ‌ద్దెదింపేందుకు సిద్ధమైపోయారు. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన బ‌స్సు దాదాపు తుస్సుయాత్రగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని స‌ర్వేలు చెబుతున్నాయి.  దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో వివేకానంద రెడ్డి హ‌త్య కేసు, కోడి కొత్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతితో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. కానీ, ఈసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెప్పేందుకు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఏకమైనట్లు కనిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు ముందుగానే ఓట‌మిని ఒప్పుకొని పోటీనుంచి వైదొలిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసేందుకు వైసీపీ అభ్య‌ర్థులు వ‌ణికిపోతున్నారని చెబుతున్నారు. ఓడిపోయే సీటులో పోటీచేసేకంటే.. ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండ‌ట‌మే బెట‌ర్ అనే నిర్ణ‌యానికి వైసీపీ అభ్య‌ర్థులు వ‌స్తున్నారు.

గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త రెండు ద‌ఫాలుగా తెలుగుదేశం అభ్య‌ర్థిగా గల్లా జ‌య‌దేవ్ విజ‌యం సాధించారు. ఈసారి ఆయ‌న రాజ‌కీయాల‌కు విరామం ఇవ్వ‌డంతో  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. చంద్ర‌శేఖ‌ర్ గ‌త కొన్నేళ్లుగా గుంటూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వ‌స్తున్నారు. పేద వ‌ర్గాల ప్ర‌జ‌లకు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వారికి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. పెమ్మ‌సానికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచిపేరు ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని విజ‌యం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

దీంతో పెమ్మ‌సానిపై పోటీ చేసేందుకు వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు పోటీ నుంచి త‌ప్పుకున్నారు. చివరకు జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు కిలారు కోశ‌య్య‌ గుంటూరు పార్ల‌మెంట్  నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయ‌నకూడా పోటీ నుంచి త‌ప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ క్యాడ‌ర్ సైతం పెమ్మ‌సానికే జై కొడుతున్నారనీ,  దీంతో పోటీలో నిలిచి ఓడిపోవ‌డం కంటే పోటీ నుంచి త‌ప్పుకోవ‌టం మేల‌న్న భావ‌న‌కు కిలారు రోశ‌య్య వ‌చ్చారనీ గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలుత క్రికెటర్ అంబటి రాయుడును బ‌రిలోకి దింపాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావించారు. అయితే, ఆయన పార్టీలో చేరిన కొద్దికాలంకే వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో గుంటూరు పార్ల‌మెంట్‌ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా న‌ర్స‌రావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులును పోటీ చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఆయ‌న అందుకు స‌సేమిరా అన‌డంతో న‌ర్స‌రావుపేట నుంచి మ‌రోసారి టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ నిరాక‌రించాడు. దీంతో శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు తెలుగుదేశంలో చేరి మ‌రోసారి న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు.  గుంటూరు పార్ల‌మెంట్ కు పోటీచేసేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌టంతో  వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయ‌న‌కూడా పోటీ చేసేందుకు నిరాస‌క్త‌త‌ను వ్య‌క్తం చేయడంతోపాటు.. రెండు వారాలైనా నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. దీంతో ఉమ్మారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను గుంటూరు అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దించారు.  ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే  ఇప్పుడు ఆయ‌న‌సైతం పోటీనుంచి త‌ప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పెమ్మ‌సాని రాజ‌కీయ‌ వ్యూహాల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు సైతం ఫిదా అవుతున్నార‌ట‌. దీంతో ప‌లువురు వైసీపీ నేత‌లు సైతం లోపాయికారికంగా పెమ్మ‌సాని విజ‌యంకోసం ప‌నిచేస్తున్నార‌న్న ప్ర‌చారం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్నది. దీంతో ఎంత ప్ర‌య‌త్నించినా నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజ‌యం అసాధ్య‌మ‌ని కిలారు రోశ‌య్య పార్టీ నేత‌ల వ‌ద్ద పేర్కొన్నార‌ని సమాచారం. పెమ్మ‌సాని విజ‌యాన్ని ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డంకంటే త‌ప్పుకోవ‌టం మేల‌న్న భావ‌న‌ను పార్టీ నేత‌ల వ‌ద్ద కిలారు రోశ‌య్య ప్ర‌స్తావించిన‌ట్లు గుంటూరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి ఆయ‌న‌పై పోటీకి వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ అభ్య‌ర్థిగాఉన్న కిలారు రోశ‌య్య కూడా పోటీనుంచి త‌ప్పుకుంటాన‌ని వైసీపీ అధిష్టానం వ‌ద్ద వెల్ల‌డించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కిలారు రోశ‌య్య స్థానంలో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఓడిపోయినా స‌రే.. పోటీలో మాత్రం ఉండ‌డాల‌ని వైసీపీ అధిష్టానం ఆళ్ల‌కు సూచించిన‌ట్లు సమాచారం. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి కోసం  ప్ర‌చారం చేస్తున్నారు.  మొత్తానికి గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ దెబ్బ‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే వైసీపీ ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.