గోబెల్స్ ను మించిపోయిన వైసీపీ ప్రచారం

Publish Date:Feb 12, 2026

Advertisement

శుద్ధ అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. అటువంటి ప్రచారంలో వైసీపీది అందె వేసిన చేయిగా పరిశీలకులు అంటున్నారు. అయితే వైసీపీ ఓటుకు నోటు కేసులో అలుపులేకుండా చేస్తున్న అబద్ధపు ప్రచారం ఫలితం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇందుకు కారణాలను కూడా సహేతుకంగా విశ్లేషిస్తున్నారు.  ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఉన్నారనీ, ఆ కేసు కోసమే తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డితో చంద్రబాబు రాజీపడుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నది. గతంలో అంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా అప్పడు ఏపీ సీఎంగా కేసీఆర్ తోనూ చంద్రబాబు లాలూచీ రాజకీయం నెరపారని వైసీపీ ప్రచారం చేస్తున్నది. 

అయితే వాస్తవానికి  ఓటుకు నోటు కేసులో   చంద్రబాబు ముద్దాయి కాదు.  చార్జిషీట్ లో ఆయన పేరు లేదు. కాగా చంద్రబాబు పేరు ఓటుకు నోటు కేసులో లేకపోవడంపై గతంలో వైసీపీ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే అక్కడ ఆ పార్టీకి చుక్కెదురైంది. ఆ తరువాత సుప్రీంను కూడా ఆశ్రయించింది.. అక్కడా వైసీపీకి ఎదురుదెబ్బే తగిలింది.   ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన వైసీపీకి పరాభవం తప్పలేదు.  

అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదాన్నిఆసరాగా తీసుకుని రాజకీయం కోసం మళ్లీ ఓటుకు నోటు కేసును వాడేసుకుంటోంది. దానితో పాటు ఓటుకు నోటు కేసు కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నిలిపి వేయించారని  వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అదెలాగంటే.. ఓటుకు నోటు కేసు కు సంబంధించిన కీలక వివరాలు ఆ ల్యాబ్ లో ఉన్నాయి. ఆ ఫైల్స్ దగ్ధం చేసేందుకు రేవంత్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారనీ ఆరోపిస్తోంది.  అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ సైతం ఉండడంతో ఆ ఇరువురూ   కలిసి   అగ్ని ప్రమాదం చేయించారని ఆరోపిస్తూ.. ఇందు కోసం చంద్రబాబు రేవంత్ కు అనుకూలంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని చెబుతోంది. 

ఇక ఓటుకు నోటు కేసు విషయానికి వస్తే.. 2015లో ఓ నామినేటెడ్  ఓ నామినేటెడ్ ఎమ్మెల్సీ ని ప్రలోభ పెట్టారన్న కేసులో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు.  ఆ కేసులో చంద్రబాబు ప్రస్తావనే లేదు.  అయితే కోర్టుకు దాఖలు చేసిన చార్జి షీట్లో   చంద్రబాబు ప్రస్తావన ఒకచోట ఉంది. దీనిపైనే గతంలో  వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కోరారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్నారెడ్డి  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటీషన్ డిస్మిస్ చేసింది. ఇది జరిగి సంవత్సరాలు గడిచిపోయినా వైసీపీ మాత్రం ఆ ఆరోపణలనే పట్టుకు వెళాడుతోంది. 

ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం విషయానికి వస్తే.,. ఆ అగ్నిప్రమాదంలో  ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ టాపింగ్ కేసునకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కాలేదని సంబంధిత అధికారులు విస్పష్టంగా ప్రకటించారు. అయినా సరే  వైసీపీ తన తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణలో విపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ఓటుకు నోటు కేసు ఫైల్స్ దగ్ధం కోసమే ఆ కేసులో ఏ1గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించిందని ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. తెలంగాణ సీఎం రేవంత్ ను కేసులో ఏ1గా చార్జిషీట్ లో పేర్కొన్నందున బీఆర్ఎస్ ఆరోపణలు చేయడాన్నితప్పుపట్టలేం. 

కానీ వైసీపీ  మాత్రం ఓటుకు నోటు ప్రస్తావన తీసుకొస్తూనే ఉంది. కోర్టుల్లో మొట్టికాయలు తిన్న తరువాత కూడా ఆ పార్టీ ఆ ప్రచారం కొనసాగిస్తుంది. ఇక ఈ కేసు కోసం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశారని మరో అబద్ధాన్ని కూడా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. వాస్తవానికి  2020 లోనే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అప్పటి జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టారు.అయితే కేంద్రం అందుకు అనుమతులు ఇవ్వలేదు. వాస్తవం అలా ఉంటే.. ఏపీలో 2024 ఎన్నికలలో విజయం సాధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన తరువాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని వైసీపీ చెప్పడం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న అసత్య ప్రచారమేనంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.