విశాఖలో వైసీపీ ఖాళీ!

Publish Date:Jul 22, 2024

Advertisement

విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. విశాఖ రాజధాని అంటూ ఐదేళ్ల పాటు జగన్ ఆడిన డ్రామాకు విశాఖ ప్రజలు తెర దించేశారు. విశాఖ అభివృద్ధిని భూ స్థాపితం చేసి భూదందాల కోసం రాజధాని అంటూ మభ్యపెట్టేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు.

విశాఖ పరిధిలో మొత్తం ఓట్లలో 70 శాతం వరకూ కూటమి అభ్యర్థులకే  పడ్డాయంటే వైసీపీని ప్రజలు ఎలా తిరస్కరించారో అర్థమవుతుంది. అందుకే తమ రాజకీయ భవిష్యత్ ను చూసుకుంటూ.. వైసీపీ కార్పొరేటర్లుఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. వారు వెళ్లిపోతున్నా ఆపేందుకు వైసీపీ కీలక నేతలు కనీసం ప్రయత్నించడం లేదు. సరే సార్వత్రిక ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో విశాఖ  ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన జగన్ పార్టీ ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ లోనూ ఖాళీ అయిపోతుంటే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతోంది. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లోకి క్యూకట్టారు.  ఇప్పుడు తాజాగా మరికొందరు తెలుగుదేశం గూటికి చేరారు. ఔను 13 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మరో ఇండిపెండెంట్ కార్పొరేటరు కూడా సైకిలెక్కేశారు. మరో పది మంది కార్పొరేటర్లు జనసేన గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు. ఈ పది మంది మంగళవారం (జులై 23) జనసేన కండువా కప్పుకోనున్నారు.  ఈ పది మందినీ కూడా కలుపుకుంటే విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్ల బలం 20కి పడిపోతుంది. దీంతో విశాఖ మేయర్  రాజీనామా కోసం తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేయడానికి రెడీ అవుతున్నారు.  

వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనను సవరించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఒక్క విశాఖ అనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితి ఇలాగే ఉంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీని వీడి కూటమి పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం కూడదు అన్న నిబంధనను మార్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.  

By
en-us Political News

  
తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్ వచ్చే మార్గంలో పెచ్చులు ఉడి పడడంతో సచివాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణలో జరిగిన కులగణన సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు.
ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. దీన్ని శాసనాలు పురాతన గ్రంథాల్లో కమ్మమెట్టుగా పేర్కొన్నారు. మొట్టమొదటి ఈ కోట యొక్క బీజం ఇక్ష్వాకుల కాలంలో పడింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను వదిలిపెట్టొద్దని ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో విజయంపై విపరీతమైన ధీమాతో కనిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మెజార్టీ 20 వేలకు తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపధం కూడా చేశారు.
ఏపీ మద్యం కుంభకోణ కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరుపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై ఇప్పటికే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతునే ఉంది. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో గురువారం భేటీ అయ్యారు.
తెలంగాణ మంత్రి సీతక్క ప్రజా ప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ 2021లో సీతక్క ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై కేసు నమోదు చేసింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్‌ కేక్‌ కట్‌ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.