ఓటమి తరువాత నెల రోజులకే వైసీపీ ఖాళీ.. సీఎం రమేష్ జోస్యం

Publish Date:Apr 24, 2024

Advertisement

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. సరే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్ వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రుల నుంచి ఇక్కడి తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ సహకారం అందకుండా నిలువరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనీ, ఇందు కోసం తెలంగాణలోని ఆంధ్రులపై ఆయన సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించారనీ కూడా అప్పట్లో చెప్పుకున్నారు. సరే అది పక్కన పెడితే..

జగన్ సైతం తన మిత్రుడికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇతోధిక సహకారం అందించారు. లేని సెంటిమెంటును రెచ్చగొట్టైనా మిత్రుడు కేసీఆర్ ను గట్టెక్కించాలని జగన్ ప్రయత్నించారు. ఎన్నికల రోజుకు సరిగ్గా ముందు రోజు అర్ధరాత్రి సాగర్ వద్ద ఏపీ పోలీసులతో హంగామా చేయించారు. అయితే అవేమీ ఫలించలేదు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ రోజు రోజుకూ బక్కచిక్కిపోతున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీలలోకి వలసలు పెరిగిపోయాయి. పోతే పోనీ అని బీఆర్ఎస్ అధినేత డాంబికంగా చెబుతున్నప్పటికీ.. వలసల ఉధృతి చూస్తుంటే లోక్ సభ ఎన్నికల తరువాత ఆ పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. సిట్టింగులు, మాజీలే కాదు, ద్వితీయ శ్రేణి నేతలూ, చివరాఖరికి పార్టీ క్యాడరూ కూడా కారు దిగిపోవడానికి తహతహలాడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. 

ఇదే విషయాన్ని బీజేపీ నేత, ఆ పార్టీ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ ఎత్తి చూపుతూ.. ఏపీలో జగన్  ఓటమి తరువాత వైసీపీకీ అదే గతి పడుతుందన్నారు. అంతే కాదు బీఆర్ఎస్ కంటే వేగంగా వైసీపీయే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం రమేష్ జగన్ అధికారం కోల్పోయిన తరువాత కనీసం నెల రోులు కూడా ఆ పార్టీ మనుగడ సాగించ లేదనీ, చాలా వేగంగా జారుడుబండ మీద నుంచి జారినట్లు ఆ పార్టీ నుంచి నేతలు జారిపోతారని రమేష్ అన్నారు. కనీసం బీఆర్ఎస్ నేతలు వలసల విషయంలో కొంత సమయం తీసుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అంత టైమ్ జగన్ కు ఇవ్వరన్నారు.   

నిజమే.. పేరుకే ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో మాత్రం పెత్తనమంతా వాలంటీర్లదే. ఆ పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురైన ఎమ్మెల్యేలకు జగన్ పట్ల విధేయత, విశ్వసనీయత ఉండే అవకాశం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పటికే జగన్ పట్ల పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోందనీ, ఓటమి తరువాత అది తిరుగుబాటు స్థాయికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనీ అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.