తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ ఏం చేసిందంటే?..

Publish Date:Jan 7, 2026

Advertisement

తిరుమల పవిత్రతను దెబ్బతీయడం, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే లక్ష్యంగా జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. తిరుమలలొ ఓ  గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం సీసాల కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని బుధవారం (జనవరి 7) మీడియా ముందు ప్రవేశ పెట్టారు.  

ఈ నెల 4న సామాజిక మాధ్యమంలో తిరుమలలో పోలీసు గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీ మద్యం సీసాలు అంటూ, ఫొటోలతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఖాళీ మద్యం సీసాలను  వైసీపీ నేతలు,  ఆ పార్టీకి చెందిన   మీడియా వ్యక్తులు  కుట్రపూరితంగా తిరుపతి నుంచి తీసుకువచ్చి కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కన పొదల్లో పడేశారని తేల్చారు.   వైసీపీ   మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు   కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించారు. అలాగే    ఎక్సైజ్ డిపార్టుమెంటు  సహకారంతో ఖాళీ సీసాల పైన వున్న ఆధారాల ద్వారా,  వాటిని కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు.  తిరుమల పవిత్రతను దెబ్బతీసి.. తద్వారా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే  వైసీపీ నేతలు ఈ పని చేశారని నిర్ధారించారు.  సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ నివేదిక, నిందితుల వాహనాల రాక పోకలు, ఫోన్ సిగ్నల్స్‌ సహా ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ కుట్రను ఛేదించినట్లు తిరుపతి పోలీసులు మీడియాకు వివరించారు.  ఈ కేసుకు సంబంధించి    వైసీపీ కార్యకర్త కోటి, ఆ పార్టీ అధికారిక మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ ను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు, వైసీపీ సోషల్ మీడియా   కార్యకర్త నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడనీ, అతడి కోసం గాలిస్తున్నామనీ తెలిపారు. ఇలా ఉండగా అరెస్టు చేసిన ఇద్దరినీ,  కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. 

By
en-us Political News

  
లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే.
చింతక్రింది సాయిజ్యోతి రచించిన చేయి వీడని చెలిమి అనే నవలను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు
నటి అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు
ఆదిలాబాద్‌ జిల్లా భోరాజ్‌ మండలం హతిఘాట్‌లో చనాకా-కొరాటా పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు.
మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు
ఈ సంక్రాంతి సీజ‌న్లో కేవ‌లం రెండు రోజుల‌కే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జ‌రిగాయో చూస్తే ఆశ్చర్యపోతారు
ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.
142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.