వైసీపీ ఓటమి ఖాయం.. వీళ్ల మాటలే సాక్ష్యం!

Publish Date:May 15, 2024

Advertisement

ఏపీలో పోలింగ్ ముగిసింది. వైసీపీ మూకల అరాచకం, హింసాకాండ, బెదరింపులు, దాడులు ఇవేమీ పట్టించుకోకుండా జనం అపూర్వమనదగ్గ పట్టుదలతో ఓటు వేశారు. భారీ పోలింగ్ నమోదైంది. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. ఈ భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పుడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వైసీపీ ఓటమి దాదాపుగా ఖాయమైందని వారు చెబుతున్నారు. 

అయితే వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు, పరిశీలకులు విశ్లేషించడం కాదు.. స్వయంగా వైసీపీయే తన తీరు ద్వారా, వ్యాఖ్యల ద్వారా, ప్రదర్శిస్తున్న అసహనం ద్వారా ఓటమిని పోలింగ్ ముగియక ముందే అంగీకరించేసింది. ఇక ఆ పార్టీ అధినేత జగన్ అయితే  పోలింగ్ తేదీకి చాలా ముందుగానే బేలగా ఈ సారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అంటూ తన ఆందోళనను, ఓటమి భయాన్నీ వెళ్లగక్కేశారు. ఏదో పార్టీ సమావేశంలోనే, కీలక నేతలతో మంతనాల సమయంలోనే కాదు.. ఏకంగా బహిరంగ వేదికపై జగన్ ఈ మాటలు చెప్పి పార్టీ పరాజయం తథ్యమన్న సంకేతాలను జనానికే కాదు, సొంత పార్టీ క్యాడర్ కు కూడా ఇచ్చేశారు. 

ఇక ఆ పార్టీ కీలక నేత, మంత్రి రోజా అయితే పోలింగ్ జరుగుతుండగనే.. తాను ఓడిపోబోతున్నానని ప్రకటించేశారు. నగరి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పని చేశారని చెప్పారు. ఏకంగా మీడియా ముఖంగానే ఆమె ఈ మాటలు చెబుతూ వైసీపీ పరువు గంగలో కలిపేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తరువాత మాజీ మంత్రి, నెల్లూరు నుంచి నరసరావుపేటకు వలస వచ్చి మీసం తిప్పి తొడకొట్టి కూటమికి సవాలు చేసిన వైసీపి ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్‌ యాదవ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేశారు. సరిగ్గా ఇవే మాటలు చెప్పకపోయినా   టిడిపికి బలం ఉన్న చోట అసలు పోలీసులే లేరు. వాళ్ళను ఇష్టం వచ్చిన్నట్లు ఓట్లు వేసుకోమని వదిలేశారు. కానీ వైసీపికి బలం ఉన్న చోట వందలాది మంది పోలీసులను మోహరించి అడుగడుగునా నియంత్రించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసి అనిల్ కుమార్ వైసీపీ ఓటమి తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.  

ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే.. మీడియా సమావేశంలో భోరున ఏడ్చినంత పని చేశారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకూ పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారనీ, మంత్రినైన తాను చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు. సాధారణంగా ఓటమి ఖరారైన తరువాతే నేతల నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయి. పల్నాడు సహా పలు ప్రాంతాలలో వైసీపీ మూకలు రెచ్చిపోయి హింసాకాండకు, దౌర్జన్యాలకు తెగబడినా తెలుగుదేశం దీటుగా ప్రతిఘటించింది. పోలింగ్ సజావుగా సాగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఎక్కడా ఇలా వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రుల్లా బేల మాటలు మాట్లాడలేదు. రీపోలింగ్ కు డిమాండ్ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం చేతులెత్తేసింది. పోలింగ్ ఏకపక్షంగా జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. 

ఇవన్నీ ఒకెత్తైతే ఇలా పోలింగ్ ముగిసిందో లేదో అలా విదేశాలకు చెక్కేయడానికి జగన్ వేసుకున్న ప్లాన్, ఆయన విదేశాలకు వెడితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అంటూ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ తో జనానికి వైసీపీ ఓటమికి సాకులు, పలాయనానికి దారులు వేతుక్కుంటోందన్న సంకేతాలు ఇచ్చినట్లైంది.  

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సోమవారం (జూన్ 10)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
ఐసీసీ మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్ పై విజయాల సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (జూన్ 9)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
కేంద్రమంత్రిగా గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్రమంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  మాజీ ప్రధాని నెహ్రూ వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన సంగతి తెలిసిందే.
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదేళ్ళపాటు జగన్‌తో అంటకాగి ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన పాపం తన పీకకు భారీ స్థాయిలో చుట్టుకుంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మళయాళ నటుడు సురేష్ గోపి అరుదైన రికార్డు దక్కించుకున్నారు.  కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించిన ప్రముఖ నటుడు సురేశ్ గోపి... మోదీ కేబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా మరో మైలురాయిని అందుకుంటున్నారు.
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఉలవచారు బిర్యానీ చిత్రంలో ఈ సాంగ్ గుర్తొచ్చే విధంగా ఉంది మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో నడ్డా విందు.  ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది. 
తాజాగా రాష్ట్రం నుంచి మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్‌లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి నరసాపురం బీజేపీ ఎంపీ  భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కిందని సమాచారం.
వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. వారిలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. 
జడ్చర్ల పంచాయతీ కార్యాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీ. శ. 12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా .ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం వున్న మద్యం పాలసీని రద్దు చేపి కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.